AP: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా ఈనెల 21లోగా వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 21 పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. పూర్తి వివరాలు https://training.prismappolice.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు.