బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో తులం బంగారం రూ.80వేలు దాటినప్పటి నుంచి రూ.లక్షకు చేరుతుందేమోనని అనుకుంటున్నారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 87,500 ఉండగా ఇవాళ రూ.110 పెరిగి రూ. 87,610కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 79,800 ఉండగా.. నేడు రూ.100 పెరిగి రూ. 79,900కు చేరింది.