GNTR: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని AITUC రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, గుంటూరు నగర కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేసి, 43 వేల క్లెయిమ్లను పరిష్కరించాలని మంగళవారం కోరారు.