TG: పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. పరీక్షల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని, తగ్గించాలని డిమాండ్స్ వెలువడుతున్నాయి. MLC శ్రీపాల్ రెడ్డి సైతం పరీక్షల వ్యవధి తగ్గించాలని CM రేవంత్ రెడ్డిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.