TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్సై సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా, నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.
SKLM: రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో ఈరోజు పైవంతెన కింద నుంచి పీసీని గ్రామానికి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని శ్రీకాకుళం-విశాఖపట్నం వెళుతున్న RTC బస్సు ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇజ్జాడ త్రినాధరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 అంబులెన్సులో శ్రీకాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
NLR: బోగోలు మండలం కడనూతల శివారులో బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. బిట్రగుంటలో క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని కావలికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట క్రిష్ణారెడ్డి ప్రమాదాన్ని గమనించారు. బాధితుడి వద్దకు వెళ్లి తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.
CTR: కానిస్టేబుల్ భార్య సూసైడ్ చేసుకున్న ఘటన నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని టి.చవటపల్లెకు చెందిన హేమంత్ చిత్తూరు ఆర్ముడ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఆయన భార్య దేవి(40) గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. బుధవారం మూడోసారి పిచోటపల్లిలోని బావిలో దూకి మృతి చెందింది. ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.
NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.
NLR: మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్డు సమీపంలోని వంతెనపై ఆటో బోల్తా పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనుబోలు కోదండరామ పురానికి చెందిన శాంతి సేవ సంస్థ అధ్యక్షుడు ఆనంద్, ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అన్నదమ్ములు. వీరు సొంత ఆటోలో నెల్లూరుకి పని మీద వెళ్లి తిరిగి సొంత ఊరికి వస్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని ప్రమాదం జరిగింది.
VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.
VSP: ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరాగాంధీనగర్లోని బుధవారం రాత్రి గ్యాస్ లీకైన ఘటనలో గాయపడ్డ వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజశేఖర్ (11) 45%, సత్యవతి (28) 50%శాతం, టి. చంద్రశేఖర్ (13)26%, పి.వెంకట్రావు (30) 20% శాతం కాలిన గాయాలవ్వగా.. జి.జస్మిత్ అనే బాలుడి తలకు చిన్న గాయమైంది. ఈ ఘటనలో ప్రమాద ధాటికి గోడ ధ్వంసం అయ్యింది.
ASR: అక్రమంగా తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కు ఆటోపై మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న టేకు దుంగలను దేవీపట్నం మండలం కంబలంపాలెం శివార్లలో పట్టుకున్నారు. వాహనంతోపాటు బొల్లెదుపాలెం తరలిస్తునట్లు ఇందుకూరు ఇన్ఛార్జి సెక్షన్ అధికారి హరీష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
E.G: రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారీపడడంతో గోదావరి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది.
TG: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కానిస్టేబుల్ శృతితో పాటు మరో ఇద్దరు చెరువులో దూకినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని.. ఆత్మహత్య కారణాలపై విచారణ చేస్తున్నారు.