MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నీట్ పీజీ మెడికల్ కోర్సుల కోసం స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) ఇంటర్న్షిప్ కట్-ఆఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగించింది. దీంతో ఐదు రాష్ట్రాల నుంచి అదనంగా 13,000 MBBS విద్యార్థులు 2023 పరీక్షకు అర్హత సాధించారు. మొదట ప్రకటించిన ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ తేదీ మార్చి 31, తర్వాత జనవరిలో జూన్ 30కి పొడిగించింది. ఆయా రాష్ట...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చిబాబును ఢిల్లీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢీల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భాగంగా బుచ్చిబాబు పాత్ర ఉందని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులోని అనుబంధ ఛార్జీషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవ...
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ అయిన వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే మూడుకుపైగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. తాజాగా మరో సంస్థ అయిన ఎల్టీఐ మైం డ్ ట్రీ(LTI mindtree) ఈ నెలాఖరు నాటికి తమ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మంత్రి ...
భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్(13)(Natasha Perianayagam) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఎంపికైంది. ఆమె తాజా ప్రయత్నంలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. పరీక్షలకు 76 దేశాల నుంచి హాజరైన 15,300 మంది అభ్యర్థులలో 27 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించగా..నటాషా మాత్రం టాప్ లో నిలిచింది. ఈ పోటీలను యునైటెడ్ స్టేట...
తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్(ts eamcet 2023) ఇంజినీరింగ్, మే 12వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీలను కూడా ప్రకటించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ...
అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికలకు సమయం దగ్గరికి వస్తుండడంతో ఈలోపే అధికార యంత్రాంగానికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్, ఐఏఎస్ లతో పాటు అన్ని శాఖల్లోనూ పదోన్నతులు, బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించింది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...
నిండా పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. వందల కోట్లకు పడగలెత్తింది. పుట్టిన రోజు కోసం ఏం కొందామో తెలియక పొరపాటున కొన్న లాటరీ టికెట్ ఆమెను కోటీశ్వరాలిని చేసేసింది. తాత చెప్పిన మాటతో కొన్న లాటరీ టికెట్ తో ఆమెకు రూ.290 కోట్లు దక్కాయి. అదృష్టమంటే ఈ అమ్మాయిదే కదా. అయితే వచ్చిన ఆ డబ్బుతో ఆమె మెర్సిడెస్ బెంజ్ కార్లు, అత్యంత విలాసవంతమైన బంగ్లా కొనడంతో పాటు భవిష్యత్ దృష్ట్యా కొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టే...
హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్కు రుణాల...
అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ అంశంపై సభలో మాట్లాడారు. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడయ్యాడని ఆరోపించాడు. దీనిపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఘాటుగా ...
యువ నటుడు కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా మారాడు. జయపజయాలు పక్కన పెట్టి వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈనెల 17న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఇద్దరి ఇష్టాలు ఒక్కటైతే.. ఫోన్ నంబర్ ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. చదవ...
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నోవేల మందికి గాయాలయ్యాయి. భూకంపం దాటికి ఈ దేశాలు కకావికలమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు, చనిపోయినవారిని తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కూలిపోయిన భవనాల కింద వేలాదిమంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస...
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ కావాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఉన్నత విద్య చదవాలంటే ప్రవేశ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. ఉమ్మడి పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తే అత్యుత్తమ కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్ సెట...
శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసినట్లు నిందితుడు అప్తాప్ విచారణలో అంగీకరించినట్లు ఛార్జీషీట్లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు 6600 పేజీలతో సుప్రీం కోర్టుకు ఛార్జీషీటును సమర్పించారు. ఇందులోని పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధను హత్య చేశాక అప్తాబ్ ఆమె ఎముకలను స్టోన్ గ్రైండర్తో పొడి చేసి దానిని దూరంగా విసిరేశాడు. చిట్టచి...