AP: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద బస్సు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఉదయం 7:45 గంటలకు ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని బస్సులో మంటలార్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.