GDWL: అలంపూర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తి శనివారం హత్యకు గురయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి బట్టలు లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కర్నూలు ప్రాంతానికి చెందిన వాడై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.