TG: నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో దారుణం జరిగింది. భార్య శ్రావణిని భర్త శ్రీశైలం దారుణంగా హత్య చేశారు. భార్య శ్రావణిపై అనుమానంతో కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సోమశిల వెళదామని చెప్పి భార్యను తీసుకెళ్లిన శ్రీశైలం.. మార్గం మధ్యలో ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.