AP: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమార్తె.. ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు మృతిచెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.