జమ్ముకశ్మీర్లోని రియాసిలో జూన్ 9న భక్తులతో నిండిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 10మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అసభ్యకర వీడియో కేసులో ఇరుక్కున్న రేవణ్ణను మే 31న పోలీసులు అరెస్ట్ చేశారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం (జూన్ 10) జరిగిన ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు. మిలిటెంట్లు కాంగ్పోక్పి జిల్లాలో మెరుపుదాడి చేశారు.
దేశ 18వ లోక్సభకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.