• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

ATP: అనంతపురం 34వ డివిజన్‌లోని 74వ సచివాలయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పది మంది సిబ్బందికి ముగ్గురే ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ విజిట్‌లో ఉన్న వారికి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.

April 8, 2026 / 02:20 PM IST

భవన నిర్మాణ పనులను తనిఖీ చేసిన మంత్రి

VSP: ఎండాడ, సాగర్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

April 8, 2026 / 02:16 PM IST

ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలో నిర్వహించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదలను అందజేశారు.

April 8, 2026 / 02:16 PM IST

‘గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

SKLM: గాలి కుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు ఎస్. సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 8, 2026 / 02:13 PM IST

‘ముగ్గురు డైరెక్టర్లను నియమించాలి’

AKP: ఎలమంచిలిలో బుధవారం తూర్పు కాపు జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాకు ముగ్గురు తూర్పు కాపు డైరెక్టర్లను నియమించాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

April 8, 2026 / 02:11 PM IST

టీడీపీ కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మొహమ్మద్ యాకోబ్ మృతిచెందడంతో బుధవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్ధివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 8, 2026 / 02:00 PM IST

పులివెందుల: టీడీపీలోకి చేరికలు

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.

April 8, 2026 / 01:54 PM IST

టీడీపీలోకి భారీ చేరికలు

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.

April 8, 2026 / 01:54 PM IST

బేతంచర్లలో హోరాహోరీగా కబడ్డీ పోటీలు

NDL: బేతంచెర్ల చౌడేశ్వరి మాత కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా మ్యాట్‌పై నిర్వహిస్తున్న ఈ పోటీలకు 30 జట్లు హాజరయ్యా యి. మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వీటిని ప్రారంభించారు. యువకుల కేరింతలు, ఈలల మధ్య కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.

April 8, 2026 / 01:46 PM IST

ఏబీఎన్‌ రాధాకృష్ణపై వైసీపీ నిరసన

BPT: బాపట్లలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌, మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాధాకృష్ణ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయగా, ఈ ర్యాలీని ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లు వారు తెలిపారు.

April 8, 2026 / 01:41 PM IST

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

KRNL: ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన యూకే సుహాసిని ఇవాళ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందిస్తూ, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని కోరారు.

April 8, 2026 / 01:41 PM IST

మౌలిక వసతులు కల్పించండి: కమిషనర్‌కి వినతి

SKLM: అరసవిల్లి -కాజీపేట శ్రీ ఆసిరిమ్మ తల్లి సిరిమాను పండగల నిమిత్తం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావుకి బుధవారం వినతి పత్రం అందజేశారు. పండుగలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీరు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్ తదితర అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అరసవల్లి అమ్మవారి కమిటీ సభ్యులు కోరారు.

April 8, 2026 / 01:41 PM IST

TTD ట్రస్టులకు రికార్డు స్థాయి విరాళాలు

TPT: ఈ ఏడాది తొలి మూడు నెలల్లో TTD ట్రస్టులకు రూ.374.24 కోట్ల రికార్డు విరాళాలు వచ్చాయి. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.149.55 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.66.18 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.37.12 కోట్లు లభించాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు మూలధనం రూ.2,556 కోట్లకు చేరిందని టీటీడీ అధికారులు తెలిపారు.

April 8, 2026 / 01:38 PM IST

బాల్య వివాహాలతో అనర్దాలు: ఎస్సై

CTR: కార్వేటినగరం మండలం పద్మ సరస్సులో ‘మీ భద్రతే.. మా బాధ్యత’ కార్యక్రమంలో ఎస్సై తేజస్విని, ICDS అధికారులు పాల్గొన్నారు. కళాత్మక ప్రదర్శనతో బాల్య వివాహాలతో జరిగే అనర్దాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. చిన్న వయసులో పెళ్లి చేయడం తల్లి, బిడ్డకు మంచిదికాదని తెలిపారు.

April 8, 2026 / 01:37 PM IST

కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని పరిశీలించిన ఎంపీ

AKP: అనకాపల్లికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థల పరిశీలన చేశారు. అచ్చయ్యపేట వద్ద పరిశీలించిన స్థలం అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

April 8, 2026 / 01:35 PM IST