• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు: MPDO

CTR: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. మంగళవారం స్థానికులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. మొరంపల్లి, సుగాలిమిట్ట, ఏడూరు, రంగోలిమిట్ట, మీర్జేపల్లిలో కొత్త బోర్లు వేయాలని, లక్ష్మీనాయక్ తాండ, చదల్లలో బోరు డీప్నింగ్ చేయాలని కోరారు. స్పందించిన ఎంపీడీవో, నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

April 28, 2026 / 03:14 PM IST

చాపాడు మండలంలో చలివేంద్ర ప్రారంభం

KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ చాపాడులో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా మజ్జిగ, శుద్ధ నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. KC కాలువ కింద రైతులు మంచి దిగుబడులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అలగనూరు బాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

April 28, 2026 / 03:03 PM IST

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ తరగతుల ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు, శాస్త్రవేత్త సుబ్బారావు స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఎంఈవో పుష్పరాజ్యం పాల్గొని రిబ్బన్ కట్ చేసి తరగతులను ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

April 28, 2026 / 03:00 PM IST

అభివృద్ధిపై ఎమ్మెల్యే జూలకంటి మీడియా సమావేశం

PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి, రానున్న ప్రాజెక్టులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వివరాలు వెల్లడిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై స్పష్టత ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

April 28, 2026 / 02:51 PM IST

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లను నివారించేందుకు జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు అద్దంకిలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. బంక్ నిర్వాహకులు కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని, క్యాన్‌లలో నింపరాదని ఆదేశించారు.

April 28, 2026 / 02:44 PM IST

రూ.33.50 లక్షల రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలోని డ్వామా కార్యాలయంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం వెలుగు గ్రామ సంఘాల వీవోఏలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం పీఎం-అజయ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.33.50 లక్షల రుణాల మంజూరు పత్రాలను మహిళలకు హ్యాండోవర్ చేశారు.

April 28, 2026 / 02:40 PM IST

తిరుపతిలో ఉరితాడు బిగించుకుని నిరసన

తిరుపతిలో ఇంధన కొరత, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. CITU ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వరకు డీజిల్ లేక ఆగిపోయిన ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు బిగించుకుని తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఇంధనం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 02:39 PM IST

రిపోర్టర్ హత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

సత్యసాయి: చిత్తూరు జిల్లాలో ఏబీఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులను హత్య చేయడం క్షమించరాని నేరమని, నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

April 28, 2026 / 02:36 PM IST

నగరిలో సంఘమిత్రలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ

CTR: నగరి ఎంపీడీవో కార్యాలయంలో DRDA ఆధ్వర్యంలో 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు, విధులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే కోరారు.

April 28, 2026 / 02:33 PM IST

‘ఇంధన కొరతపై ప్రభుత్వానికి చలనం లేదు’

E.G: కేవలం ఏపీలోనే పెట్రోల్, డీజీల్‌ సంక్షోభం, కృతిమ కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, రూరల్ వైసీపీ ఇంఛార్జ్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మంగళవారం రాజమండ్రిలోని పెట్రోల్ బంకు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదన్నారు.

April 28, 2026 / 02:30 PM IST

డీజిల్ అందుబాటులో ఉంచాలి: రఘురాం

W.G: రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉంచాలని YCP నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు డిమాండ్ చేశారు. ఇంధన కొరతపై మంగళవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోతే బంకులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం బంకుల వద్ద టిన్నులు పెట్టే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

April 28, 2026 / 02:30 PM IST

చెత్త పేరుకుపోతూ దుర్గంధం

ASR: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలోని పెదలబుడు పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుంచి సమ్మెకు దిగారు. గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. సమ్మె కారణంగా పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో అరకులోయ అందాలు మసకబారే పరిస్థితి నెలకొంది.

April 28, 2026 / 02:30 PM IST

ఇంధన కొరతపై కేంద్రానికి ఎంపీ లేఖ

KDP: ఏపీలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. 70% బంకుల్లో “నో స్టాక్” ఉందని పేర్కొంటూ, వెంటనే జోక్యం చేసి సరఫరా మెరుగుపరచాలని కోరారు. ఈ కొరత వల్ల వ్యవసాయం, వ్యాపార రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని, ఏపీలోనే సమస్య ఎక్కువగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.

April 28, 2026 / 02:30 PM IST

వివోఏలకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, పీడీ నాగరాజకుమారితో కలిసి మంగళవారం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (voa)లకు 5G మొబైల్ ఫోన్లు అందజేశారు. కావలి -41, బోగోలు -35, దగదర్తి -35, అల్లూరు -37 మొత్తం 148 మంది వీవోఏలకు రూ. 22,20,000 విలువైన ఫోన్లు అందజేశారు. గ్రామస్థాయిలో సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

April 28, 2026 / 02:30 PM IST

త్వరలో గుంటూరు-కనిగిరి మధ్య ప్యాసింజర్ రైలు

ప్రకాశం: టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి మేరకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరికి ప్రతిరోజూ ఒక డెమో రైలు నడపాలని నిర్ణయించారు. ఈ రైలు గుంటూరులో ఉదయం 8:30కు బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు కనిగిరికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కనిగిరి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు గుంటూరుకు చేరుతుందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 02:29 PM IST