• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హజ్ కమిటీలో చోటు.. మైనారిటీల హర్షం

CTR: ఏపీ హజ్ కమిటీలో పలమనేరుకు చెందిన మౌలానా అబ్దుల్ అలీమ్ జూనెద్‌కు అవకాశం కల్పించడంపై మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ కేటగిరీలో సబ్ క్లాస్-3 కింద ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిఫారసుతో అవకాశం లభించిందని పేర్కొంటూ, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను మైనారిటీ సోదరులు సన్మానించారు.

April 7, 2026 / 05:26 PM IST

అవినీతిపై చర్యలు తీసుకోరా: ఐద్వా జిల్లా అధ్యక్షురాలు

WG: ఆకివీడు డ్వాక్రా సంఘాల్లో రూ. 2 కోట్ల అవినీతి జరిగిన అధికారులు స్పందించకపోవడం దారుణమని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి మంగళవారం ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం తగదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా గ్రూపు సభ్యులతో కలిసి జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

April 7, 2026 / 05:21 PM IST

చిలమత్తూరులో అభివృద్ధిపై బాలకృష్ణ సమీక్ష

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం చిలమత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా వేగంగా పనులు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 7, 2026 / 05:20 PM IST

మురమండ స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ ఎంపీడీవో

E.G: కడియం మండలం మురమండ గ్రామానికి పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో నీలం శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్ రావు, సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకి రామయ్య దత్తుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేయాలని కోరారు.

April 7, 2026 / 05:20 PM IST

మహిళల వేధింపులకు జైలు శిక్ష

NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను వేధించిన పిన్నాపురం మనోహర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దీబగుంట్లలో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు 296 బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రవికుమార్ శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

April 7, 2026 / 05:17 PM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్

VZM: మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లిమర్ల మిమ్స్ నుంచి వేణుగోపాలపురం వరకు మంగళవారం వాక్‌థాన్ నిర్వహించగా సుమారు 100 మంది MBBS విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన కలిగించే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు పాల్గొన్నారు.

April 7, 2026 / 05:15 PM IST

మెనూ పాటించకపోతే చర్యలు: కలెక్టర్

PPM: మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. సాలూరు మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 7, 2026 / 05:14 PM IST

వేతనాలు వెంటనే విడుదల చేయాలి: జిల్లా కమిటీ

W.G: VRAలకు ఏడవ తేదీ వచ్చినా మార్చి నెల వేతనాలు చెల్లించకపోవడంపై జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. ఆంజనేయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న VRAల కుటుంబాలు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన వేతనాలను విడుదల చేయాలని, రెవెన్యూ సిబ్బందిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

April 7, 2026 / 05:14 PM IST

అగ్నిమాపక శాఖ బలోపేతానికి చర్యలు

AKP: అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త అగ్నిమాపక వాహనాలు సీఎం చంద్రబాబుతో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 25 అత్యధిక ఫైర్ ఇంజన్లు అందజేస్తామన్నారు.

April 7, 2026 / 05:12 PM IST

జిల్లాలో కూటమి ప్రభుత్వంలో చేరికలు

కడప: జిల్లా TDP అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, మండల కూటమి ఇంఛార్జ్ శివనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో బెడుదూరులో మంగళవారం 70 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి నాయకులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. CM, లోకేశ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అయి ఎంతోమంది పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

April 7, 2026 / 05:11 PM IST

చంద్రబాబు రాయలసీమకు చెడ్డ బిడ్డ: సాకే శైలజానాథ్

ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతిలో YCP జిల్లా స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శింగనమల వైసీపీ ఇంఛార్జ్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమకు పెద్ద బిడ్డ కాదు, చెడ్డ బిడ్డ అని విమర్శించారు. సీమ ప్రాజెక్టులు పూర్తయితే తన ఉనికి పోతుందనే భయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

April 7, 2026 / 05:10 PM IST

క్రీడాకారిణి శైలజకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

సత్యసాయి: నేషనల్ గోల్ షాట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి శైలజకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆర్థిక సాయం అందజేశారు. ఆమె క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా రూ.35,000 నగదును అందజేశారు. కదిరి రూరల్ నాయకులు భార్గవ, కదిరప్ప, ఆది, నరేష్, అంజి తదితరుల సమక్షంలో ఈ సాయం అందించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 7, 2026 / 04:51 PM IST

‘ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార’

E.G: ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార యొక్క ముఖ్య ఉద్దేశమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో జలధార కార్యక్రమంలో భాగంగా చెరువు వద్ద చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

April 7, 2026 / 04:50 PM IST

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

NLR: పని ప్రదేశాలలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ARD స్వచ్ఛంద సంస్థ, ICDS ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

April 7, 2026 / 04:50 PM IST

విద్యుత్ శాఖపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష

ATP: అనంతపురంలోని APSPDCL కార్యాలయంలో మంగళవారం విద్యుత్ శాఖ అభివృద్ధి పథకాలపై మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో మరింత పురోగతి రావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.

April 7, 2026 / 04:46 PM IST