• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘సీఎం వల్లే కాఫీకి మంచి బ్రాండ్ వచ్చింది’

VSP: గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం విశాఖలో ఆమె సమీక్షా నిర్వహించారు. గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు వల్లే కాఫీకి మంచి బ్రాండ్ వచ్చిందన్నారు.

April 8, 2026 / 07:47 PM IST

యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి కమిటీతో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి మెరుగుపరచడంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

April 8, 2026 / 07:45 PM IST

వేసవి తాపానికి జీవీఎంసీ చర్యలు

VSP: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ నగరంలోని 10 జోన్లలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం అదనపు కమిషనర్ పి. నల్లనయ్య తెలిపారు. హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్షించారు. చలివేంద్రాల్లో తాగునీరు, ORS ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు.

April 8, 2026 / 07:43 PM IST

కబడ్డీ టోర్నీలో ఎరిగేరి జట్టు ఘనవిజయం

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కౌతాళం మండలం ఎరిగేరి పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. గోస్పాడు(M) సాంబవరంలో నిర్వహించిన ఈ టోర్నీలో జిల్లా వ్యాప్తంగా 58 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోరులో అద్భుత ప్రతిభ కనబర్చిన ఎరిగేరి విద్యార్థులు ప్రథమ బహుమతితో పాటు ట్రోఫీని గెలుచుకున్నారు. విజేతలను నిర్వాహకులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

April 8, 2026 / 07:37 PM IST

రేపు కొత్తబురుజుకు కలెక్టర్ రాక

NDL: డోన్ మండలం కొత్తబురుజు గ్రామానికి గురువారం నూతన తాగునీటి పైప్ లైన్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితో పాటు కలెక్టర్ రాజకుమారి హాజరవుతున్నారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.

April 8, 2026 / 07:29 PM IST

తాడేపల్లిగూడెంలో వైసీపీ నేతలతో జగన్ సమీక్ష

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అత్యధిక స్థానాలు సాధించాలని పిలుపు నిచ్చారు.

April 8, 2026 / 07:24 PM IST

కలెక్టర్‌ను కలిసిన APUWJ నాయకులు

CTR: కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు రెండవ విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, మీడియాపై దాడుల నివారణపై కాసేపు చర్చించారు.

April 8, 2026 / 07:20 PM IST

వెలవెలబోయిన వారపు సంత

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ప్రతి బుధవారం జరిగే వారపు సంత ఈసారి వెలవెలబోయింది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దగా రాకపోవడంతో వ్యాపారం మందగించింది. ఎండలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

April 8, 2026 / 07:15 PM IST

మంచినీటి చెరువు అభివృద్ధికి చర్యలు

KKD: గొల్లప్రోలులోని మొగలి సూర్యుడు మంచినీటి చెరువు అభివృద్ధికి వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని పాడా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ శివప్రసాద్ బుధవారం ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ ఈఈ ధర్మతేజతో కలిసి ఆయన చెరువును పరిశీలించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ఈ పనులు ఇప్పటివరకు ముందుకు సాగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

April 8, 2026 / 07:14 PM IST

‘సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం’

AKP: నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రతివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ తెలిపారు. ఎలమంచిలిలో బుధవారం నిర్వహించిన జనవాణిలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.‌ వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అర్జీ దారులతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

April 8, 2026 / 07:13 PM IST

ఉచిత పాలిసెట్ కోచింగ్ ప్రారంభం

VZM: సీతం కళాశాలలో ఉచిత పాలిసెట్ (POLYCET) కోచింగ్ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక విలువైన అవకాశమని డైరెక్టర్ డా మజ్జి శశి భూషణరావు తెలిపారు. పరీక్షలో విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించేందుకు అవసరమైన సమగ్ర శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

April 8, 2026 / 07:12 PM IST

ఎస్సై పదోన్నతి పరీక్షలు పరిశీలించిన ఐజీ

KRNL: దిన్నదేవరపాడు వద్ద ఉన్న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో జరుగుతున్న ఎస్సై పదోన్నతి ఎంపిక పరీక్షలను బుధవారం ఐజీ, అనంతపురం రేంజ్ ఇంఛార్జ్ డీఐజీ డా. షిమోషి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. రాయలసీమ జోన్‌కు చెందిన 72 మంది ఏఎస్సైలకు డ్రిల్, ఆయుధాల పరిజ్ఞానం, నేరస్థల పరిశీలన, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు.

April 8, 2026 / 07:06 PM IST

బూత్ లెవల్ అధికారులకు సహకరించాలి: కమిషనర్

NLR: నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సాగుతోందని కమిషనర్ వైఓ.నందన్ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వేకు వచ్చే బూత్ లెవల్ అధికారులకు పూర్తి సమాచారం అందించి సహకరించాలని కోరారు.

April 8, 2026 / 07:06 PM IST

విద్యుత్ తీగల దొంగకు మూడేళ్ల జైలు శిక్ష

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు దొంగిలించిన రాఘవేంద్రకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 2024లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, 33 విద్యుత్ దొంగతనాల కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

April 8, 2026 / 07:02 PM IST

మూల్యాంకనం పకడ్బందీగా జరగాలి: కలెక్టర్

ATP: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూల్యాంకన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూల్యాంకన విధానం, రోజువారీ సబ్జెక్టుల కేటాయింపు వంటి వివరాలను ఆరా తీశారు.

April 8, 2026 / 07:02 PM IST