ELR: దెందులూరు(m) కొవ్వలి పెద్దచెరువులో పెద్దచెరువులో చాలా కాలం తర్వాత విజిలింగ్ డక్స్ కనిపించాయి. పక్షులు రాకతో కొవ్వలి పెద్ద చెరువు మళ్లీ జీవంతో కళకళలాడూతూ.. కనిపిస్తుందని స్థానికులు తెలిపారు. ఈ పక్షి పూర్తిగా శాకాహారి అని కొల్లేరులోనే సంతానోత్పత్తి చేసుకుని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయని అన్నారు. పక్షులు రావడంతో పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు.
NDL: ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామస్తులు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న సమస్యలను వారు డీఎస్పీకి వివరించారు. అనంతరం DSP శ్రీనివాసులును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
VSP: మధురవాడ సమీపంలోని ఓ కాలనీలో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద్ పదహారేళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అతడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటబొమ్మాళి గంగుపేటకు చెందిన సదునుపల్లి రాము (34), రమేష్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. వస్త్ర దుకాణాలకు సిబ్బంది పంపిస్తూ జీవనం సాగిస్తున్న వీరు విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రహదారి దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరూ ఎగిరిపడి మృతి చెందారు.
PPM: వీరఘట్టం మండలం పాపంపేటలోని అంగన్వాడీ కేంద్రానికి రక్షణ గోడ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఆవరణలోకి పశువులు ప్రవేశిస్తుండటంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా కర్రలు, వస్త్రాలతో కంచె ఏర్పాటు చేసుకున్నప్పటికీ పూర్తి భద్రత లేకపోవడంతో అధికారులు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు.
అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, తెట్టు హరిజనవాడలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బోరు మోటార్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. 20 రోజుల క్రితం గ్రామ సెక్రెటరీకి అర్జీ పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
KDP: భారతీయ వస్త్ర రంగాన్ని ప్రపంచ మార్కెట్లో బలోపేతం చేసేందుకు జిల్లాలో జౌళి పరిశ్రమను, ఎగుమతులను ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా, కమిషనర్ రేఖరాణి నిర్వహించిన టెక్స్ టైల్స్ ఎగుమతుల విజన్-2030 వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు.
NDL: కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ విదేశీ పర్యటన ఖరారైంది. మే 14 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. విదేశీ యాత్రకు అనుమతి ఇవ్వాలని పెట్టుకున్న ఆయన వినతికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు అనుమతి, సెలవు మంజూరు చేసింది. అనంతరం అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది.
ఏలూరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 3 పెట్రోల్ బంకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని జేసీ అభిషేక్ గౌడ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో డీజిల్కు ఎటువంటి కొరత లేదన్నారు. రాత్రి 7 గంటల వరకు 412 కిలో లీటర్ల పెట్రోల్, 670 కిలో లీటర్ల డీజిల్ అమ్మకం జరిగిందన్నారు. కూపన్ విధానం ద్వారా అగ్రికల్చర్, ఫిషరీస్ ఎమర్జెన్సీ సర్వీసులకు డీజిల్ సరఫరా చేశామన్నారు.
NDL: అహోబిలంలో నరసింహ జ్యంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో మంగళవారం శ్రీ జ్వాలా నరసింహస్వామికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొట్టి తిరుమంజనం ముగిసిన తర్వాత స్వామివారు అశ్వ వాహనంపై కొలువుదీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
KRNL: ఏపీ టెన్త్ ఫలితాలు గురువారం విడుదల అయితునట్లు జిల్లా విద్యాశాఖ అధికారిక యంత్రాంగం తెలిపింది. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. NOTE: ఫలితాలను వేగంగా, అందరికంటే ముందుగా మన HIT TV యాప్లో తెలుసుకోవచ్చు.
తిరుపతి జిల్లాలోని గ్రామీణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 30వ తేదీ లోపు పంచాయతీలోని ప్రజలు పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇవ్వనున్నారు. జిల్లాలో 4.6 లక్షల అసెస్మెంట్లకు 2026-27కు సంబంధించిన ఇంటి పన్ను డిమాండ్ నోటీస్ ఏకకాలంలో పంపించనున్నారు. కాగా, తొలిసారి గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు అందుబాటులోకి రాయితీ అమలు చేస్తున్నారు.
VSP: మాజీ మంత్రి R.S.D.P అప్పల నరసింహరాజు మృతి చెందారు. పద్మనాభం మండలం పాండ్రంగిలో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇతను భీమిలి నియోజకవర్గంలో 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి NTR హయాంలో మంత్రిగా పని చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని నియోజకవర్గ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KKD: కేంద్రమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన చెన్నై నుంచి విమానంలో రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రకాశం: మేదరమెట్ల సమీపంలోని పిచ్చుకల గుడిపాడు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బల్లికురవ మండలం ముక్తేశ్వరకి చెందిన పిట్టల శ్రీకాంత్, బైలడుగు ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వీరిని అంబులెన్స్లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.