KRNL: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు కర్నూలు ఆర్ఐవో లాలప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ఫీజును ప్రకటించిన తేదీల్లోనే చెల్లించాలని తెలిపారు.
VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం స్థానిక హుకుంపేటలో సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఘటాలను దర్శించుకుని పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం చిత్ర, విచిత్ర వేషధారణలతో అంగరంగ వైభవంగా ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అర్ధరాత్రి తర్వాత మూడు లాంతర్ల వద్దనున్న చదరుగుడిలో ప్రతిష్టించారు.
ATP: జిల్లాలో గత 24 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రెండు మండలాల్లో వర్షం కురిసింది. బొమ్మనహాల్ మండలంలో గరిష్ఠంగా 13.2 మి.మీ, డీ హీరేహాల్ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. జిల్లా మొత్తం 23 మి.మీ వర్షం కురవగా, సగటున 0.7 మి.మీగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నెల్లూరు: కావలి పట్టణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రైల్వే అండర్ పాస్ను పరిశీలించారు. ఉదయగిరి రోడ్డు నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. దీంతో వెంగళరావు నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సత్యసాయి: ధర్మవరంలో శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి రథోత్సవం బుధవారం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. రథోత్సవం కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.
KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలోని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. గణపతి, నవగ్రహ, రుద్ర, దీక్ష హోమాలను నిర్వహించారు. గంగా గౌరీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను రావణబ్రహ్మ వాహనంపై కొలువు దీర్చారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఊరేగించారు.
ASR: అరకులోయలో వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేంకటేశ్వరస్వామి అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల మెడలో మంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం “గోవిందా” అనే నామస్మరణతో మారుమ్రోగింది.
KRNL: తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న జనగణన-2027లో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. ఈ విధానం ద్వారా ప్రతీ కుటుంబం తమ ఇంటి వివరాలను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్సైట్ www.se.census.gov.inలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
AKP: దేవరాపల్లి మండల ఎంపీడీవోగా ఎస్. కిరణ్ వరప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎం.వి. సువర్ణరాజు జిల్లా కోఆర్డినేటర్ (ఎస్ఈబ్ల్యూపీసీ)గా డిప్యూటేషన్పై వెళ్లడంతో ఆయన స్థానంలో కిరణ్ వరప్రసాద్ నియమితులయ్యారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
SKLM: అరసవిల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన “అభయం హెల్మెట్ బ్యాంక్” ను సోమవారం సాయంత్రం SP మహేశ్వర రెడ్డి సందర్శించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు .
ప్రకాశం: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. హైవే అంబులెన్స్ గాయాలైన వారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది.
KDP: కమలాపురం మండలంలోని చదిపిరాళ్ల గొల్లపల్లె గ్రామాల మధ్యన వెలసిన మంచాలమ్మ పాలేటి గంగమ్మ తిరునాళ్ళు మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం అమ్మవారికి పూజలు, అభిషేకాలు, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపారాధన నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరన్నారు.
CTR: పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుషార్, చిత్తూరు సాయుధ దళం కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 72 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. భూతగాదాలు 19, నగదు లావాదేవీలు 12, కుటుంబ సమస్యలు 11 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
BPT: బల్లికురవ మండలం ముక్తేవ్వరం గ్రామానికి చెందిన రజని అనే వివాహిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయారు. ఆమె సోదరుడు రామకోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు సోమవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థల కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం.
VZM: ఇంధనం కోసం పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చీపురుపల్లి MLA కళా వెంకటరావు సూచించారు. సోమవారం తమ నివాసంలో RDO సుధారాణి, DSP రాఘవులుతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బంకులు మూతపడకుండా చూడాలని, ఈ విషయంలో CM సీరియస్గా ఉన్నారని అన్నారు.