NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరావతికి మద్దతుగా సంబరాలు చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వర్ధిల్లాలని పలువురు అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.
E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామం శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం పాల్గొన్నారు. అమ్మవారిని ఎంపీ పురంధేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం బహుకరించారు.
సత్యసాయి: సోమందేపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. డాక్టర్ ఓంకార్ ఆధ్వర్యంలో ఆరోగ్యం కోసం కలసి కట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా వంటివి తప్పక చేయాలని, మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని తెలిపారు. మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: తాడేపల్లి YSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇవాళ పలువురు నాయకులు భేటీ అయ్యారు. మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, CEC సభ్యులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం పలు కీలక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
KDP: జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.18.80 కోట్ల ఆదాయం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కార్యాలయంలో రూ.19.87 కోట్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఈసారి రూ.1.07 కోట్ల మేర తగ్గుదల కనిపించింది. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడం వంటి అంశాలే ఈ ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
CTR: ఏపీ హజ్ కమిటీలో పలమనేరుకు చెందిన మౌలానా అబ్దుల్ అలీమ్ జూనెద్కు అవకాశం కల్పించడంపై మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ కేటగిరీలో సబ్ క్లాస్-3 కింద ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిఫారసుతో అవకాశం లభించిందని పేర్కొంటూ, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను మైనారిటీ సోదరులు సన్మానించారు.
WG: ఆకివీడు డ్వాక్రా సంఘాల్లో రూ. 2 కోట్ల అవినీతి జరిగిన అధికారులు స్పందించకపోవడం దారుణమని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి మంగళవారం ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం తగదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా గ్రూపు సభ్యులతో కలిసి జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం చిలమత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా వేగంగా పనులు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
E.G: కడియం మండలం మురమండ గ్రామానికి పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో నీలం శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్ రావు, సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకి రామయ్య దత్తుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేయాలని కోరారు.
NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను వేధించిన పిన్నాపురం మనోహర్కు 3 రోజుల జైలు శిక్ష విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దీబగుంట్లలో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు 296 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రవికుమార్ శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.
VZM: మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లిమర్ల మిమ్స్ నుంచి వేణుగోపాలపురం వరకు మంగళవారం వాక్థాన్ నిర్వహించగా సుమారు 100 మంది MBBS విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన కలిగించే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు పాల్గొన్నారు.
PPM: మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. సాలూరు మున్సిపల్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
W.G: VRAలకు ఏడవ తేదీ వచ్చినా మార్చి నెల వేతనాలు చెల్లించకపోవడంపై జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. ఆంజనేయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న VRAల కుటుంబాలు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన వేతనాలను విడుదల చేయాలని, రెవెన్యూ సిబ్బందిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూలు: పోలీసు శిక్షణా కేంద్రంలో ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్సై పదోన్నతి పరీక్షలు మంగళవారం నిర్వహించారు. రాయలసీమ జోన్కు చెందిన 72 మంది హాజరయ్యారు. ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టం, పోలీసు విధానం తదితర అంశాలపై ఇండోర్ పరీక్షలు జరిగాయిని తెలిపారు. బుధవారం ఔట్డోర్ పరీక్షలు ఉంటాయిని పేర్కొన్నారు. నిర్వహణను దీపికా పాటిల్ ఐపీఎస్ పరిశీలించారు.
AKP: అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త అగ్నిమాపక వాహనాలు సీఎం చంద్రబాబుతో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 25 అత్యధిక ఫైర్ ఇంజన్లు అందజేస్తామన్నారు.