• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

SKLM: మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలోని ABN కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బుధవారం కాశీబుగ్గ పోలీసులు ఆయనను ఇంటి వద్దే ఆపి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

April 8, 2026 / 03:21 PM IST

‘వేస్ట్ టు వండర్’ పోటీలు

VSP: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా జీవీఎంసీ నిర్వహిస్తున్న “వేస్ట్ టు వండర్” పోటీలకు ఏప్రిల్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు బుధవారం కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఇందులో స్క్రాప్‌తో 4-8 అడుగుల శిల్పాలు రూపొందించి సమర్పించాలన్నారు. ఇందులోని ఉత్తమ కళా ఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు.

April 8, 2026 / 03:11 PM IST

నగరి ఎమ్మెల్యే రేపటి షెడ్యూల్‌ ఇదే..!

CTR: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రేపు పుత్తూరు, నగరిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30కు గొల్లపల్లి సచివాలయంలో పాసుబుక్‌ల పంపిణీ, 3 గంటలకు SC & BC హాస్టల్ సందర్శన చేసి విద్యార్థులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నగరి పార్టీ కార్యాలయంలో 50 మందికి CMRF చెక్కులు పంపిణీ చేయనున్నారు.

April 8, 2026 / 02:55 PM IST

పెళ్లకూరుకు చేరిన సైకిల్ యాత్ర

TPT: డ్రగ్స్ రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర పెళ్లకూరు మండలానికి చేరుకుంది. వీరిని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఆదిలక్ష్మి స్వాగతించారు. యువతతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలు బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యతని ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.

April 8, 2026 / 02:53 PM IST

గోదావరి మోక్ష దామం నిర్మాణానికి భూమి పూజ

W.G: పెనుగొండ మండలంలోని సిద్ధాంతం ఘాట్ వద్ద గోదావరి మోక్ష దామం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో ఈ మోక్ష దామం నిర్మించనున్నారు. స్థానిక ప్రజలకు అంత్యక్రియల కోసం శుభ్రమైన, సక్రమమైన ఆధునిక సౌకర్యాలు కల్పించబడతాయని వారు చెప్పుకొచ్చారు.

April 8, 2026 / 02:48 PM IST

‘భూసేకరణ వేగవంతం చేసి అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలి’

KDP: విశ్వనాధపురం వద్ద పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని సీపీఎం నేతలు ఆర్డీవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. భూసేకరణ, పరిహారం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా, ఆర్డీవో వారంలోగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మార్గంపై సుమారు 35 గ్రామాలకు చెందిన 50 వేల మంది ఆధారపడుతున్నారని తెలిపారు.

April 8, 2026 / 02:45 PM IST

విద్యార్థులకు కూలింగ్ వాటర్ క్యాన్‌లు వితరణ

ELR: నూజివీడు(మం) అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శ్రీ సత్య సాయి భక్తులు కూలింగ్ వాటర్ క్యాన్‌లను బుధవారం బహుకరించారు. పాఠశాల హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు కూలింగ్ వాటర్ క్యాన్‌లు వితరణగా అందించడం అభినందనీయమన్నారు.

April 8, 2026 / 02:43 PM IST

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోండి: ఏఐఎస్ఎఫ్

KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన విచారణ తూతూ మంత్రంగానే జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ ఇవాళ విమర్శించారు. విచారణ పూర్తై రోజులు గడిచినా నివేదికను బయటపెట్టకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే నివేదికను వెల్లడించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

April 8, 2026 / 02:40 PM IST

నరసరావుపేటలో YCP నేతలు నిరసన

PLD: ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో బుధవారం YCP నేతలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్రజ్యోతి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉధ్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

April 8, 2026 / 02:30 PM IST

పిల్లలకు టీకాలు తప్పనిసరి: హుస్సేన్ రెడ్డి

NDL: పుట్టిన ప్రతి బిడ్డకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని బుధవారం హెల్త్ ఎక్స్‌టన్షన్ ఆఫీసర్ హుస్సేన్ రెడ్డి అన్నారు. మహానందిలో చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు టీకాలు వేశారు. ఎండాకాలంలో వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు ORS ద్రావణం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఇది ఉచితంగా లభిస్తుందని తెలిపారు.

April 8, 2026 / 02:30 PM IST

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తిన వినతులు

GNTR: సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 87వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి భారీగా వినతులు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

April 8, 2026 / 02:30 PM IST

బాపట్లలో వంతెన పనుల పరిశీలన

BPT: ముత్తాయపాలెం-కప్పలవారిపాలెం మధ్య నూతన వంతెన పనులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు బుధవారం పరిశీలించారు. నాగరాజు కాలువపై రూ.14 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. వంతెన పూర్తయితే ప్రజల దశాబ్దాల కష్టాలు తీరతాయన్నారు. ప్రయాణ దూరం తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని తెలిపారు. గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు.

April 8, 2026 / 02:30 PM IST

‘Operation Mobi Track’ సక్సెస్.. మొబైల్స్ రికవరీ

KDP: ‘Operation Mobi Track’లో భాగంగా కడప పోలీసులు 8వ విడతలో రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్, IMEI ట్రాకింగ్ ద్వారా ఈ ఫోన్‌లను గుర్తించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 5877 ఫోన్‌లు రికవరీ చేశారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

April 8, 2026 / 02:26 PM IST

సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

ATP: అనంతపురం 34వ డివిజన్‌లోని 74వ సచివాలయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పది మంది సిబ్బందికి ముగ్గురే ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ విజిట్‌లో ఉన్న వారికి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.

April 8, 2026 / 02:20 PM IST

అభివృద్ధి పనులను నెల్లూరు కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 23వ డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ నగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ మేరకు ఆయన డివిజన్ పరిధిలో నూతనంగా చేపడుతున్న ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్ సీసీ రోడ్లు, డ్రైన్ కాలువల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 8, 2026 / 02:20 PM IST