• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత: ఎస్పీ

CTR: చిత్తూరు జిల్లా పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 41 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ, డబ్బు, కుటుంబ తగాదాలు వంటి వివిధ సమస్యలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు.

April 6, 2026 / 05:21 PM IST

‘నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం’

అన్నమయ్య జిల్లాలో నీటి కొరత నివారణకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని 100 రోజుల మిషన్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. కేసాపురం పరిధిలోని రెడ్డివారిపల్లి చెరువు వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్న చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులతో భూగర్భ జలాలు 5.6 మీటర్లు పెరిగాయని, తాగునీటి సమస్య 90% వరకు పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.

April 6, 2026 / 05:21 PM IST

గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ప్రతి పనిని క్షుణ్ణంగా సమీక్షించారు. పనుల వేగాన్ని మరింత పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 6, 2026 / 05:20 PM IST

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో పట్టాలమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టుకుని క్రీడాకారులతో సరదాగా ఆడారు. పండుగల వేళ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని, యువత క్రీడలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

April 6, 2026 / 05:20 PM IST

‘గిరిజనలకు పట్టాలు మంజూరు చేయాలి’

PPM: జిల్లాలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్యాక్రాంతం, గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనులకు పేదలకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు.

April 6, 2026 / 05:15 PM IST

నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యతలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో గల చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచడం, చెరువులను పూడికతీసి నీటిని సంరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు.

April 6, 2026 / 05:14 PM IST

చేబ్రోలు కాలువలో పడిన లారీ

GNTR: చేబ్రోలు వద్ద ప్రమాదం జరిగింది. చేబ్రోలు కాలువ వంతెన పైనుంచి వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. వంతెనపై వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ కాలువలో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

April 6, 2026 / 05:10 PM IST

శరవేగంగా కసాపురం ఆలయ నిర్మాణ పనులు

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో దాతల సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోనేరుతో పాటు ఆలయంలో స్వామివారి గర్భగుడి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో విజయ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు.

April 6, 2026 / 05:10 PM IST

పాక్స్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ.. సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు.

April 6, 2026 / 05:05 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యం

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందనిజిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

April 6, 2026 / 05:03 PM IST

నల్ల బ్యాడ్జిలతో ఉపాధ్యాయులు నిరసన

AKP: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు అనకాపల్లి పదవ తరగతి స్పాట్ కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలియజేశారు. ప్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. అప్పటివరకు మధ్యంతర భృతిని ఇవ్వాలన్నారు.

April 6, 2026 / 05:01 PM IST

పుట్టపర్తిలో గవర్నర్‌కు ఘన వీడ్కోలు

సత్యసాయి: అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పూలబొక్కే అందజేసి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 05:00 PM IST

సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం మండలం వెల్లలో జల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యక్రమాన్ని మంత్రి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు ఈ పనులు జరుగుతాయన్నారు. భూగర్భ జలాల పెంపు ద్వారా సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నియోజకవర్గంలో గుర్రపు డెక్క, పూడికతీత పనుల కోసం రూ. 70 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

April 6, 2026 / 05:00 PM IST

రెండు మగ దూడలకు జన్మనిచ్చిన ఆవు

CTR: పూతలపట్టు మండలం దిగువ పాలకురు గ్రామానికి చెందిన దాము అనే రైతు ఆవు ఒకేసారి రెండు మగ దూడలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గ్రామంలో ఆసక్తిని రేకెత్తించింది. రెండు దూడలు ఆరోగ్యంగా ఉండటంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు కూడా ఈ దృశ్యాన్ని చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు.

April 6, 2026 / 05:00 PM IST

గజ్జరంలో ‘నీటి భద్రతా సాగునీటి సంఘాల భాద్యత’

E.G: తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో కొత్త చెరువు వద్ద 100 రోజులు ప్రణాళికకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ‘నీటి భద్రతా సాగునీటి సంఘాల భాద్యత’ కార్యక్రమంలో భాగంగా వేసవిలో నీటి ఎద్దడిని నివారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు RDO కె.ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 05:00 PM IST