AKP: చోడవరం పట్టణంలోని ఎడ్లవీధి అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ గోవాడ వరలక్ష్మీ మాట్లాడుతూ.. తల్లులు తమ పిల్లలకు పోషక విలువలు గల ఆహారం అందించాలని చెప్పారు. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల వారి మెదడు ఉత్తేజంగా పని చేస్తుందన్నారు. సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు.
ASR: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పునాదులు వేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కలెక్టర్ నిషాంతి కొనియాడారు. శనివారం పాడేరులో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
GNTR: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్టలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావమై, క్షతగాత్రుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AKP: గొలుగొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం గ్రామంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, సహాయ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, స్కూల్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు. గ్రామంలో విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులను తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు.
VSP: గాజువాక 75వ వార్డ్ చిన కోరాడ SC కాలనీలో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ SC/ST యోజన’ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. పెద గంట్యాడ మండలంలో సుమారు 350 మంది అర్హులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
KRNL: ఆస్పరి మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇవాళ MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వారాలకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణం లేదా హంద్రీ నీవా కాల్వ నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
KDP: ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో వ్యవసాయ నష్టంతో సారా సురేష్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు విఫలమవడంతో అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను పొలంలో పురుగుల మందు సేవించాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
PLD: మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రేమ జంటల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారంపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆటో డ్రైవర్ సాయంతో రహస్యంగా వీడియోలు తీసి డబ్బులు వసూలు చేయడంతో పాటు మహిళలను వేధించినట్లు నిర్ధారణ అయింది. ఆయన బెదిరింపుల వీడియోలు వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్లతో భేటీ అయిన సీఎం, రాజకీయాలు, పరిపాలనలో గత అనుభవాలు, ప్రస్తుత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలకు విస్తృతంగా వివరించారు.
BPT: ఏప్రిల్ నెల 19వ తేదీన బాపట్లలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుని అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు.
అన్నమయ్య: మదనపల్లె వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పాత కేసులో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం చేపట్టింది.
CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి.. భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు పర్యవేక్షించారు.
PPM: పాచిపెంట మండలం మోసురు గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు, వీధి కాలువలు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎంపీడీవో బీవీజే పాత్రో తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ డి.రవితో కలిసి పర్యటించారు. ఏ ఏ కాలనీలో సీసీ రోడ్లు, వీధి కాలువలు అవసరం అనేది గుర్తించామని, గ్రామంలో తాగునీరు సమస్య లేకుండా చూస్తామని వారు పేర్కొన్నారు.
E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో MPDO శ్రీనివాస్ అధ్యక్షతన జలధార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిక్కవోలు MPP సుమ పాల్గొని, మాట్లాడారు. జలవనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువులు, నీటి వనరులను పరిరక్షించాలని ఎన్డీఏ కన్వీనర్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల త్రిమూర్తులు, చిట్టిబాబు చౌదరి పాల్గొన్నారు.