SKLM: జలుమూరు మండలం బుడితి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా జలుమూరు మండలంలోని గ్రామాలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ వి. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తిమడాం, పర్లాం, మాకివలస, అచ్యుతాపురం, శ్రీముఖ లింగం గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.