ఏలూరు జిల్లాలో నిర్మితమవుతున్న పలు జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ విషయంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏలూరు గౌతమీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించి అవరోధాలను అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు.