ADB: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఉట్నూర్ నేతకాని సంఘం నాయకులు కోరారు. సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా సోమవారం ఆ సంఘం నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మహేందర్, సంఘం నాయకులు దర్శన గంగరాజు పాల్గొన్నారు.