WG: మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్ సచివాలయంలో పలువురు రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో కాళీపట్నం ఇనం ఎస్టేట్ భూములు సమస్యలు పరిష్కరించే దిశగా గ్రామంలోని పలువురు రైతుల నుంచి వారి అభిప్రాయాలను జేసీ అడిగి తెలుసుకున్నారు. భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా రైతులు ముందుకు రావాలని అన్నారు.