KKD: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం పెద్దాపురం నియోజకవర్గ కేంద్రంలోని జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రికి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు రామస్వామి బాబు ఘనస్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ వెళ్తూ… మధ్యలో జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ నేతలు జానకీ రామారావు, సరోజ్ వాసు, సాయిబాబు, యూత్ సభ్యులు ఉన్నారు.