• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మెప్మా సభ్యులుతో మంత్రి సత్య కుమార్ సమావేశం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఎన్డీయే కార్యాలయంలో గురువారం మెప్మా సభ్యులతో మంత్రి సత్య కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, మెప్మా పీడీలు, సీవోలు పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, సమగ్ర అభివృద్ధి సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి అధికారులకు సూచించారు.

August 28, 2025 / 12:39 PM IST

డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

KRNL: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కర్నూలు DEO శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రారంభమైంది. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను రాష్ట్ర విద్యా శాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.

August 28, 2025 / 12:39 PM IST

6న నాదెండ్ల మండల సర్వసభ్య సమావేశం

PLD: నాదెండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 6న శనివారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో గురువారం తెలిపారు. ఈ సమావేశానికి మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, గ్రామ సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు.

August 28, 2025 / 12:39 PM IST

ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన

VZM: మహిళలకు స్త్రీ శక్తి పధకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. దీనికి నిరసనగా గురువారం రాజాం పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు మార్కెట్‌ యార్డ్‌ నుంచి స్దానిక MRO ఆఫీస్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు రామూర్తినాయడు డిమాండ్ చేశారు.

August 28, 2025 / 12:37 PM IST

ఉప రాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన నారాయణ

 NLR: ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తిరుమలలో కలిశారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని వారు దర్శించుకున్నారు. గురువారం సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.

August 28, 2025 / 12:35 PM IST

జీఎంసీ కౌన్సిల్ సమావేశం

GNTR: గుంటూరు నగర పాలక సంస్థ (GMC) ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. భారీ వర్షాల కారణంగా కాల్వలు నిండిపోయి రోడ్లపైకి నీరు వస్తున్నందున ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, డ్రైనేజ్ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

August 28, 2025 / 12:31 PM IST

రూ.3.50 కోట్లతో 36 అభివృద్ధి పనుల ప్రారంభం

అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 36 అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సిమెంటు రోడ్లు, డ్రైనేజీ వంటి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, కూటమి ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని.. రాబోయే రోజుల్లో రాయచోటిని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

August 28, 2025 / 12:30 PM IST

వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళం

కోనసీమ: మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి గురువారం వసంతవాడ వాస్తవ్వులు కాకర్లపూడి అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతలకు స్వామి చిత్ర పటాన్ని అందజేశారు.

August 28, 2025 / 12:28 PM IST

శ్రీ కాళహస్తి మున్సిపల్ ఇన్‌స్పెక్టర్ ఆకస్మిక మృతి

TPT: శ్రీకాళహస్తి శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ గురువారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం యథావిధిగా విధులు నిర్వహించుకుని స్వగ్రామం చంద్రగిరికి వెళ్లారు. గురువారం ఉదయం స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్లారు. అంతలోనే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో శ్రీకాళహస్తి మున్సిపల్ సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

August 28, 2025 / 12:26 PM IST

విద్యుత్ అమరులకు ఘన నివాళులు

SKLM: విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా 28 ఆగస్ట్ 2020లో హైదరాబాద్ బషీర్‌బాగ్ వద్ద నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా గురువారం పలాసలోని కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో అమరులైన కామ్రేడ్స్‌కు నివాళులర్పించారు.

August 28, 2025 / 12:22 PM IST

తెనాలిలో భారీ వర్షపాతం నమోదు

GNTR: తెనాలి డివిజన్ వ్యాప్తంగా గురువారం ఉదయం వరకు మొత్తం 332.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలు. తెనాలి 35.8 మి.మీ, దుగ్గిరాల 58.6 మి.మీ, కొల్లిపర 43.2 మి.మీ, కాకుమాను 39.4 మి.మీ, తాడేపల్లి 45.6 మి.మీ, మంగళగిరి 39.2 మి.మీ, చేబ్రోలు 48.4 మి.మీ, పొన్నూరు 22.6 మి.మీ నమోదైంది.

August 28, 2025 / 12:22 PM IST

రంగనాథ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

KDP: పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి వారి నూలు పూజా పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ఎమ్మెల్సీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి MLC రాంగోపాల్ రెడ్డి ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు.

August 28, 2025 / 12:20 PM IST

భారీ వర్షాలపై మంత్రి సమీక్ష

BPT: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం వర్షాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.

August 28, 2025 / 12:16 PM IST

కిసాన్ సెల్ అల్లూరి జిల్లా ఛైర్మన్‌గా గంగాధర్

ASR: కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అల్లూరి జిల్లా ఛైర్మన్‌గా పాంగి గంగాధర్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అరకు మండలం లోతేరు గ్రామానికి చెందిన గంగాధర్ ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలు గుర్తించిన అధిష్టానం ఆ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఛైర్మన్‌గా నియమించింది.

August 28, 2025 / 12:15 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను గురువారం కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి ఆరా తీశారు. ఆస్పత్రి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యశాల అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

August 28, 2025 / 12:15 PM IST