• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సరస్వతి కండ్రిగలో YSRCP గ్రామ కమిటీ ఏర్పాటు

TPT: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో YSR కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా రెడ్డివారి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. వివిధ విభాగాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.

February 23, 2026 / 08:12 PM IST

అంగన్వాడీ కార్యకర్తల సమావేశం

VZM: ఈనెల 23, 24వ తేదీలలో సీడీపీవో కార్యాలయం వద్ద చేపట్టవలసిన దీక్షలపై సోమవారం వియ్యంపేట ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2019 నుంచి జీతాలు పెంచలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 42 రోజులు దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు.

February 23, 2026 / 08:12 PM IST

సైబర్ నేరాలపై అవగాహన

ASR: జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో పెదబయలు ఎస్సై వెంకటేష్ అడుగులపుట్టు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, మహిళల రక్షణతో పాటు గంజాయి, నాటుసారా (ID Arrack) అనర్థాలపై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 08:11 PM IST

‘అగ్రిగోల్డ్ సమస్య కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి’

అగ్రి గోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అగ్రి గోల్డ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ ఈ జనవరి నాటికి మూసి 12 ఏళ్ళు పూర్తి అయిందన్నారు. అయినా కానీ ఆ సమస్య అలాగే ఉందన్నారు.

February 23, 2026 / 08:10 PM IST

జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే..!

ఏలూరు: జిల్లాలో 10 పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 08:10 PM IST

ఉద్యోగులకు అందని వేతనాలు..!

కడప: YVUలోని 140 మంది ఆప్కాస్ ఉద్యోగులు నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు నాలుగు నెలలుగా ప్రభుత్వ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బడ్జెట్ లేదనే కారణంతో ఫైనాన్స్ అధికారులు నిధులను మళ్లిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వైద్య సేవలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి.

February 23, 2026 / 08:04 PM IST

‘వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు కేటాయించాలి’

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు నిధులు కేటాయించి, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పామూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల తాగునీరు, సాగునీరు అవసరాలకు వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్నారు.

February 23, 2026 / 08:04 PM IST

పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో రేపు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 08:00 PM IST

ప్రజా ఫిర్యాదుల పరిష్కర కార్యక్రమం

CTR: ఇవాళ జరిగిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ప్రజల నుంచి 36 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపవద్దని అధికారులను ఆదేశించారు. అన్ని పిటిషన్లను చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని, ఇచ్చిన గడువులోపు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ వారిని ఆదేశించారు. పోలీసులు న్యాయం అందించడానికి నిజాయితీగా పనిచేయాలని ఎస్పీ నొక్కి చెప్పారు.

February 23, 2026 / 08:00 PM IST

ప్రజల అర్జీలకు అధిక ప్రాధాన్యత

కృష్ణా: ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు.

February 23, 2026 / 08:00 PM IST

తిరుపతి జిల్లాలో అయోడిన్ లోప సర్వే

TPT: జాతీయ అయోడిన్ లోప నియంత్రణ కార్యక్రమం కింద తిరుపతి జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించిన IDD సర్వేను DM&HO డా.బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 30 PHCల పరిధిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 6-12 ఏళ్ల విద్యార్థుల మెడ పరీక్షలు చేసి గోయిటర్ స్థితిని పరిశీలించారు. ఇళ్లలో వాడుతున్న ఉప్పు, కొంత మంది విద్యార్థుల మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

February 23, 2026 / 07:44 PM IST

మార్చి 25న ఏయూ స్నాతకోత్సవం

VSP: ఏయూ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని మార్చి 25న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ వేదికపై పట్టాలు అందుకోనున్నారు.

February 23, 2026 / 07:43 PM IST

చందోలు ఈత శిక్షకుడికి జాతీయ స్థాయి గుర్తింపు

BPT: జాతీయ పోలీస్ స్విమ్మింగ్ పోటీల సాంకేతిక నిపుణుడిగా చందోలుకు చెందిన షేక్ ఖాజా మొహిద్దీన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం గుంటూరు నగర పాలక సంస్థలో ఈత శిక్షకుడిగా పనిచేస్తున్న ఆయనను, ఫిబ్రవరి 23 నుండి 28 వరకు జరిగే 73వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌కు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఎంపిక చేసింది. ఈ గౌరవం దక్కడంపై ఆయన సోమవారం హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 07:41 PM IST

డాక్యుమెంట్ అప్‌లోడింగ్ వేగం పెంచాలి: కలెక్టర్

NDL: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో అధికారులు వేగంగా పనిచేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. EPTS డాక్యుమెంట్ అప్‌లోడింగ్ లక్ష్యాన్ని 15 లక్షలకు పెంచినందున మండల స్థాయిలో పర్యవేక్షణ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏకీకృత కుటుంబ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేసి వివరాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

February 23, 2026 / 07:41 PM IST

విద్యుత్ వైర్లు తగిలి రెండు ఆవులు మృతి

KRNL: తుగ్గలి మండల పరిధిలోనే రోల్లపాడు తండాలో విద్యుత్ వైర్లు తగిలి ఇవాళ రెండు ఆవులు మృతి చెందాయి. రోల్లపాడు తండాలోని ఒక వ్యవసాయ తోటలో ఉండే విద్యుత్ వైర్లకు రోల్లపాడు తండాకు చెందిన పాండు నాయక్‌కు సంబంధించిన రెండు ఆవులు తగలడంతో అక్కడికక్కడే రెండు ఆవులు మృతి చెందాయి. మృతి చెందిన ఆవులకు రూ. 80 వేల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.

February 23, 2026 / 07:40 PM IST