చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇవ్వలేమన్న ఏసీబీ కోర్టు సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు చంద్రబాబుకు అవసరమైన టెస్టులు చేయించడంపై నిర్ణయం తీసుకుంటామన్న ఏసీబీ కోర్టు ఏమైనా అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలన్న జడ్జి
ఆంధ్రప్రదేశ్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వచ్చే వారం నుంచి ఆమె పర్యటన సాగనుంది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆవేదనతో మృతిచెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి కలిసి ఓదార్చనున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.
దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్లోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో దసరా సెలవు రోజును మార్చుతూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి రోజును అక్టోబర్ 24వ తేది మార్చుతూ ఆ రోజున సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఐదో విడదతను చేపట్టనున్నారు. ఈసారి యాత్రలో రైతు సమస్యల పరిష్కారం దిశగా పోరాటం సాగించనున్నారు. అలాగే సీఎం జగన్ టార్గెట్గా పవన్ ముందుకెళ్లనున్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్పై ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక వారు బైక్పై ఇంటికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇటు జైలులో న్యాయవాదుల ములాఖత్ను కూడా జైలు అధికారులు తగ్గించారు.
పుష్పగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్షేత్రం వద్ద వజ్రాలు దొరికాయనే ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. క్షేత్రం చుట్టూ వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలంతా తమ పిల్లలేనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.