• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆర్థికశాఖ పెత్తనం జగన్‌దే.. యనమల వ్యాఖ్యలపై బుగ్గన ఫైర్

సీఎం జగన్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? అని యనమల ...

February 5, 2023 / 04:13 PM IST

చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్రానికి చేస్తాడా?: లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనే అన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పెన్షన్లు తీసేయడం, మద్య...

February 5, 2023 / 04:09 PM IST

గర్వంగా, గౌరవంగా ఆస్తులు సంపాదించుకున్న..శిల్ప రవి ఫైర్

నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రవి అక్రమాలు చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే ధీటుగా స్పందించారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరారు. తన ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. తాను గౌరవంగా, గర్వంగా ఆస్తులు సంపాదించుకున్నానని శిల్ప రవి వివరించారు. తన ఇల్లు, నంద్యాల ఆస్తులకు సంబ...

February 5, 2023 / 03:43 PM IST

ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు రిలీజ్

ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌ కానిస్టేబుళ్లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6500పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన...

February 5, 2023 / 01:31 PM IST

మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్ రాజకీయాల్లో బచ్చా అంటూ విరుచుకుపడ్డారు.‘‘డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు...

February 5, 2023 / 01:18 PM IST

హైదరాబాద్- విజయవాడ రూట్ లో ప్రయాణం చేస్తున్నారా … బిగ్ అలర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్ -విజయవాడ రూట్. జాతీయ రహదారిపై 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆంక్షలను విధించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు తగిన సూచనలు, మళ్లింపు మార్గాలను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ సవివరంగా వెల్లడించారు. హైదరాబా...

February 5, 2023 / 12:25 PM IST

తగ్గేదేలే: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిప్ట్, గన్ మెన్లు వెనక్కి

నెల్లూరు పాలిటిక్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. నిన్న కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇద్దరు గన్ మెన్లను రీ కాల్ చేసింది. దీంతో కోటంరెడ్డి ఈ రోజు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నలుగురిలో ఇద్దరు గన...

February 5, 2023 / 11:49 AM IST

ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం : రుద్రరాజు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకీ ప్రత్యేక హొదా వస్తుందని ఏపీ పీసీసీ ఛీప్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైలు మీదేనని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలుపరుద్దాం కార్యక్రమాన్ని ప్రారింభించారు. అనంతరం ఆయన పలు ప్రాంతల్లో పర్యటించారు. కేంద్ర రాష్ట్...

February 5, 2023 / 08:57 AM IST

కోటంరెడ్డికి భద్రత తగ్గింపు

గత కొన్నిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కాక రేపుతున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ సర్కార్ భద్రతను తగ్గించింది. ఇప్పటివరకు ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండగా ఇప్పుడు దానిని తగ్గించింది. ఇప్పుడది 1 ప్లస్ 1కు ఏపీ సర్కార్ చేసింది. భద్రత తగ్గింపుపై కోటంరెడ్డి కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్లు సమాచారం. వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజ...

February 4, 2023 / 10:17 PM IST

జగన్ పై తిరగబడతారు: రఘురామ

జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...

February 4, 2023 / 09:17 PM IST

వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ అదుర్స్, పవన్ కు నా మద్దతు: బాబీ

గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...

February 4, 2023 / 07:59 PM IST

ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు కొడాలి నాని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. లోకేష్ విమర్శలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారక రామారావు మృతిపై విచారణ జరిపించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి త...

February 4, 2023 / 07:22 PM IST

ఏపీలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస మండలం మందడిలో మహిళా కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటుండగా లారీ దూసుకురావడంతో ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరు...

February 4, 2023 / 06:50 PM IST

తారకరత్న కోసం విదేశాల నుంచి వైద్యులు

నందమూరి తారకరత్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన గత నెల 27న గుండెపోటుతో కుప్పంలో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ఆ రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స చేసింది. నారాయణ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. ఇంకా క...

February 4, 2023 / 05:32 PM IST

తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 57,147 మంది దర్శించుకున్నారు. అలాగే 26,094 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇకపోతే రేపు రామకృష్ణ తీర్...

February 4, 2023 / 04:43 PM IST