VZM: ఈ నెల 28న సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి మండలం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారికంగా సమాచారం అందినట్లు ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. అనంతరం అదే రోజున పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారన్నారు.
KDP: ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాయి ఊర్మిళ మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆమె భర్త సూర్యకృష్ణ స్థానిక 2-టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2-టౌన్ SI రాఘవేంద్రారెడ్డి ఆదివారం మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు.. సాయి ఊర్మిళ, సూర్య కృష్ణ దంపతులు స్థానిక గోపవరం పంచాయితీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
E.G: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆదివారం తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.
KRNL: ఆదోనిలో సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు సతీష్ గారి తల్లి గ్రేసమ్మ ఆదివారం రూ.10,111 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని పార్టీ నాయకులకు ఆమె స్వయంగా అందజేశారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించినందుకు సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇటువంటి సహకారం మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.
KKD: శంఖవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర్రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి గానూ ఈనెల 25వ తేదీ నుంచి 31వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
AKP: సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో ఈ నెల 24న పరదేశిమాంబ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం గోడపత్రిక ఆవిష్కరించారు. పండగ సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయి మహిళ వాలీబాల్ పోటీలు, 23న చిడతల పోటీలు జరుగుతాయన్నారు. 24న ఎడ్ల బండ్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
CTR: బంగారుపాళ్యం మండలంలోని పాలేరు, బలిజపల్లి గ్రామాల్లో ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిబ్బంది ట్రబుల్ మాంగర్స్, NDPS అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని అనుమానితులను కఠినంగా హెచ్చరించారు.
ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం సాయంకాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమగ్రంగా ఆరా తీశారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పారదర్శకత పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రజిని (19) కనిపించడం లేదని తల్లి నాగమ్మ, తండ్రి ఆదినారాయణలు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 9676852213 నంబర్కు తెలపాలని కోరారు.
CTR: బంగారుపాళ్యం మండలం గౌరీ నారాయణపురంకు చెందిన పండు (42) ప్రమాదవశాత్తు మొగిలి కోనేరులో పడి మృతి చెందాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 19 లేదా 20న కోనేరులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. బాధితుడి భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
VSP: మునగపాక మండలం తోటాడలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల విరాళాలతో ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయం ప్రారంభం సందర్భంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230 నుంచి రూ.260, స్కిన్తో రూ.220 నుంచి రూ. 240 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి రూ.115. మటన్ కేజీ రూ. 900 నుంచి 1000 వరకు ఉంది. 100 కోడి గుడ్లు రూ. 530కి విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
కృష్ణా: విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్లే రైలులో మహాలక్ష్మి అనే ప్రయాణికురాలు తన హ్యాండ్ బ్యాగ్ను భీమవరం రైల్వే స్టేషన్లో నిన్న మర్చిపోయారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ వెంటనే అప్రమత్తమై హ్యాండ్ బ్యాగులో ఉన్న 110 బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, రూ.5000 నగదు బాధితురాలికి ఎస్సై నిన్న అందజేశారు.
శ్రీకాకుళం: నేటి స్థానిక మార్కెట్లో చికెన్ ధరలు సుమారు స్థిరంగానే ఉన్నట్లు మార్కెట్ డేటా ప్రకటిస్తోంది. వ్యాపారుల సమాచారాల ప్రకారం కేజీ స్కిన్ చికెన్ సుమారు ₹265కు, స్కిన్లెస్ సుమారు ₹270కు, బోన్లెస్ చికెన్ సుమారు ₹275 కు విక్రయింపబడుతున్నాయి, మరియు షాపులివ్వే రేట్లు కొంచెం తేడాలతో మారవచ్చని సూచనలున్నాయి.