టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
విశాఖపట్నం శివార్లలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా యూనిట్లో రియాక్టర్ పేలుడు సంభవించింది, ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ. అదే సమయంలో మంటలను అదుపు చేసేందుకు 8 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు.
రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ సహా 44 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో వారిపై హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు.
కిడ్నీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పేదలను టార్గెట్ చేసి.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏలూరులో ఓ మహిళ వద్ద నుంచి కిడ్నీ తీసుకొని.. చెప్పిన మొత్తం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పల్నాడులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలో అస్వర్ సయ్యద్ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బక్రీద్ పండగ వేళ అన్వర్ ను అరెస్ట్ చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుతుపవనాల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో మరో నాలుగు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్(ap) వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏంటంటే టమాటా(tomatos) ధరలను సబ్సీడీపై ప్రభుత్వం రూ.50కే అందించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.