శ్రీకాకుళం ఉపనిషత్ మందిరంలో ఆదివారం సాయంత్రం “హనుమంతుడు-కార్యాసాధకుడు” అనే అంశంపై ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త, విశ్రాంత బ్యాంకు మేనేజర్ డీ. జ్ఞానేశ్వర్ పట్నాయక్ తన దైన పంధాలో నిర్వహించిన అధ్యాత్మిక మేధో మధనం శ్రోతల్ని అమితంగా ఆకట్టుకొంది.
ATP: గుంతకల్లులో ఆదివారం శ్రీ గద్దిరాల మారెమ్మ దేవి 17 వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించి రథములో కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ఎస్జీ కన్వెన్షన్లో డీఆర్డీఏ, ఐసీడీఎస్, మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 1200 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
E.G: రాజమండ్రి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూపరాణి ఆదివారం పాల్గొన్నారు. పంచానికి శాంతి, ఆధ్యాత్మికత, విలువల జీవనం గురించి తెలియజేస్తూ “ఓం శాంతి” అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్న కుమారీస్ సేవలు ఎంతో గొప్పవన్నారు. మహిళలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు.
కృష్ణా: వేసవి దృష్ట్యా త్రాగునీటి కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. ఆదివారం చల్లపల్లిలోని పుట్ట బజారులో ఉన్న పంప్ హౌస్ వద్ధ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రెండు నూతన బోర్లు వేసే పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. పంచాయతీ ఈవో పీవీ మాధవేంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ELR: బుట్టాయగూడెం జూనియర్ కాలేజ్ మైదానంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడి విజయం సాధించాలని కోరారు. 59,341 మంది డ్వాక్రా మహిళలకు రూ.378 కోట్ల 36 లక్షల విలువైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే మహిళలకు అందజేశారు.
ELR: మహిళా సాధికారికత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏఎస్పీని సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
W.G: భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్ టౌన్ స్టేషన్కు రావాలన్నారు.
KDP: రవీంద్ర నగర్లో ‘అస్తనే-యి-షామిరియా’ వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం సహనం, సేవా భావం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
KRNL: హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో భక్త కనకదాసు విగ్రహాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఎలాంటి వర్గాలు లేవని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.
W.G: జిల్లాలో సీపీఎం పాదయాత్ర 11వ రోజు ఆచంటలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా ప్రజలు నాయకులకు వినతిపత్రాలు అందజేస్తూ సమస్యలు వివరించారు. ఈ క్రమంలో ఓ చిన్నారి నాయకులను కలిసి, తన తల్లి అనారోగ్యంతో ఉందని చెబుతూ సొంత ఇంటి స్థలం కోసం విన్నవించింది. ప్రభుత్వం స్పందించి తమకు ఇల్లు కేటాయించాలని కోరిన తీరు అక్కడి వారిని కదిలించింది.
CTR: కుప్పం రూరల్ సీఐ మల్లేశ యాదవ్ గుడిపల్లి మండలం గుట్టర్లపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజా భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్ను ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, గైనకాలజిస్ట్ కవిత పాల్గొన్నారు. స్టోర్ ఎండి తిరుపతి రెడ్డి అతిథులను స్వాగతించారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి సందర్శించారు. ధరణి మిట్టీ వేర్ & ఏటీకే వెలుగు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన మట్టి పాత్రల స్టాల్ను పరిశీలించి, పర్యావరణ హితంగా మట్టి పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించారు.
KDP: వేంపల్లిలో జరుగుతున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టాలని ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి పరీక్షల్లో కాపీయింగ్ జరగేలా చూస్తున్నాయని ఆరోపించారు. వేంపల్లి ఉర్దూ కాలేజీ కేంద్రంలో కూడా మాస్ కాపీయింగ్ జరుగుతోందని తెలిపారు.