KRNL: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్నూలు జిల్లాలో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని జిల్లా IMD అధికారులు తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. రేపు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్నారు.