GNTR: ప్రత్తిపాడులో ఇవాళ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.