SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష తన కార్యాలయంలో మంగళవారం జీడి పరిశ్రమ అభివృద్ధికై సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలాస జీడి ఉత్పత్తిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. రైతులు ఉత్పత్తి చేసే జీడీ పంటకు తగిన ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వెంకన్న చౌదరితో పాటు జీడి రైతులు పాల్గొన్నారు.