PPM: శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీకమాసం రేపటి నుండి ప్రారంభం కానుందని అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పాడి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రతీ రోజు రుద్రాభిషేకాలు, బిల్వార్చన, రుద్రపూజలు విశేషంగా జరుగుతాయన్నారు. కార్తీక మాసంలోని 4సోమవారాలు ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తుతారని అన్నారు.