• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనాలను పర్యవేక్షించిన ఎస్పీ

KKD: సామర్లకోటలో శనివారం రాత్రి జరిగిన గణపతి నిమజ్జన కార్యక్రమాలను ఎస్పీ బింధుమాధవ్ పర్యవేక్షించారు. పంచారామ క్షేత్రం భీమేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని గోదావరి కాలువ వద్ద జరుగుతున్న నిమజ్జన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

September 7, 2025 / 07:03 AM IST

డీఎల్డీవోలుగా పదోన్నతి

KRNL: జిల్లాలో MPDOల నుంచి DLDOలుగా పదోన్నతి పొందిన ఇరువురు అధికారులకు స్థానాలు కేటాయిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ZP ఛైర్మన్ సీసీ (MPDO హోదా) ఎ. అశ్వనీకుమార్‌ను ప్రకాశం జిల్లా డ్వామా విజిలెన్స్ అధికారిగా నియమించారు. ఓర్వకల్లు MPDO శ్రీనివాసులును నంద్యాల జిల్లా డ్వామా APOగా నియమించారు.

September 7, 2025 / 07:02 AM IST

విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు

ఎన్టీఆర్: విజయవాడలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ. 240, స్కిన్‌తో అయితే రూ. 230కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ. 900 వద్ద స్థిరంగా ఉంది. చేపల్లో బొచ్చ రూ. 230, రాగండి రూ. 200గా విక్రయిస్తున్నారు. 30 కోడిగుడ్లు రూ.170కి అమ్ముతున్నారు.

September 7, 2025 / 06:59 AM IST

ఇండియా సిల్క్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ

NLR: ఇండియా సిల్క్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 16 సంవత్సరాల 25 ఏళ్ల యువత అర్హులని తెలియజేశారు. ఈనెల 30వ తేదీ లోపు ఈ కేవైసీ, ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని. సిల్క్ ఇండియా డిజిటల్ హబ్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

September 7, 2025 / 06:58 AM IST

అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ఉప్పర కాలనీలో శనివారం పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో రేకుల షెడ్‌‌లో ఈ బియ్యం బస్తాలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

September 7, 2025 / 06:57 AM IST

ఉద్యోగాలకు డబ్బులిచ్చి మోసపోకండి: ఎస్పీ హెచ్చరిక

KRNL: ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయని, డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ఇలాంటి వలలో పడి బాధితులు ప్రజాఫిర్యాదుల వేదికకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డబ్బుల కోసం ఆశ చూపే దళారులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

September 7, 2025 / 06:56 AM IST

నకరికల్లులో ఆట్యా-పాట్యా ఎంపిక పోటీలు

PLD: జిల్లా ఆట్యా-పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ జట్ల ఎంపిక పోటీలు నేడు నకరికల్లులో జరుగుతాయని జిల్లా కార్యదర్శి రోహిత్ జోయల్ తెలిపారు. స్థానిక వంగ వెంకట్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎంపికైన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు.

September 7, 2025 / 06:54 AM IST

కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలకు నేడు నామినేషన్లు

GNTR: తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలు జరుగునుంది. ఛైర్మన్ అభ్యర్థిగా కూటమి తరపున హరిప్రసాద్ పేరు ఖరారు అయింది. మొత్తం 11 డైరెక్టర్ స్థానాలకు టీడీపీ 6, జనసేన 4, బీజేపీ 1 స్థానానికి పోటీ చేయనున్నట్లు ఒప్పందం కుదిరింది. ఆదివారం ఉదయం టీడీపీ, జనసేన కార్యాలయాల నుంచి అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

September 7, 2025 / 06:50 AM IST

‘కాలువల్లో వ్యర్థాలు తొలగించాలి’

TPT: శ్రీకాళహస్తి 14వ వార్డులోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో మురికినీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద దుకాణదారులు చెత్త వేయడంతో పరిస్థితి దారుణంగా మారిందని, కాలువల్లో వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

September 7, 2025 / 06:49 AM IST

రైతుల ఆత్మహత్యాయత్నంపై జేడీ విచారణ

KRNL: సి. బెళగల్ మండలం పోలకల్లు గ్రామంలో ఉల్లి పంట నష్టాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువ రైతుల ఘటనపై శనివారం అధికారులు స్పందించారు. వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు వరలక్ష్మి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఏవో మల్లేష్ కుమార్ గ్రామానికి చేరుకుని ఉల్లి నిల్వలను పరిశీలించారు. నష్టాల వివరాలు తెలుసుకునేందుకు మధన్‌మోహన్  గౌడ్ కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.

September 7, 2025 / 06:49 AM IST

ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

ATR: శెట్టూరు మండలంలోని ముద్దలాపురం గ్రామానికి చెందిన కురుబ ఈశ్వరప్ప (65) అనే వృద్ధుడు తన భార్య అంజినమ్మతో 25 ఏళ్లుగా మనస్పర్థలతో వేరుగా ఉంటున్నాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని ఈశ్వరప్ప, శనివారం ఉదయం తన పొలంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని అన్న కోడలు జ్యోతి గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చింది.

September 7, 2025 / 06:47 AM IST

ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

SKLM: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వివేక్‌ అగర్వాల్‌, విశాల్‌ ధగాట్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. వారికి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనివెట్టి మండపంలో పండితులు వేద ఆశీర్వాదంతో పాటు స్వామి ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.

September 7, 2025 / 06:46 AM IST

బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ వై. దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని, 15న లాటరీ విధానంలో కేటాయించినట్లు తెలిపారు. మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్ జారీ చేస్తామన్నారు.

September 7, 2025 / 06:45 AM IST

నేడు తునిలో జాబ్ మేళా

KKD: తుని పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరుగుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య కార్యాలయ అధికారులు తెలిపారు. అర్హులున్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. టెన్త్ నుంచి ఆపైన చదివిన అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.

September 7, 2025 / 06:38 AM IST

కలెక్టర్‌‌తో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్

KKD: జిల్లాలో వంగవీటి రంగా విగ్రహ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌కు ఫోన్లో సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెట్టొద్దని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పవన్ ఆదేశించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

September 7, 2025 / 06:35 AM IST