• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంచినీటి సమస్యపై కమిషనర్‌కు వినతి పత్రం

కోనసీమ: అమలాపురం పట్టణ మున్సిపాలిటీ మంచినీటి కుళాయి సమస్యపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కి 19, 20 వార్డుల ప్రజలు బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం పట్టణంలో మంచినీటి సమస్య కొరత ఉన్నదని, ట్యాంకుల ద్వారా అన్ని వార్డులకు సప్లై చేయాలని, వేసవికాలం సందర్భంగా వార్డుల పరిధిలో మంచినీటి సమస్య లేకుండా తీర్చాలని వారు కోరారు.

February 25, 2026 / 02:25 PM IST

ప్రమాదకరంగా స్తంభాలు.. స్థానికుల ఆవేదన

NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లి వద్ద హైవే పక్కన కరెంట్ స్తంభాలు నిల్వ చేశారు. గత నెలలో ఈ ప్రాంతంలోనే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇలా రోడ్డు మార్జిన్‌లో ఎలా పడితే అలా స్తంభాలు నిల్వ చేయడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైవే నిర్వాహకులు చెప్పినా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించట్లేదని మండిపడుతున్నారు.

February 25, 2026 / 02:25 PM IST

‘వార్డుల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు’

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 21వ వార్డులో చేస్తున్న డ్రైనేజీ కాలువ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి బుధవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా సమస్యలపై వెంటనే స్పందించాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యం ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలకపాత్ర అన్నారు.

February 25, 2026 / 02:22 PM IST

చిన్నారి హత్య.. వెలుగులోకి కొత్త విషయాలు

TPT: ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ తల్లి తన కుమార్తెను హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశాలత భర్తతో విడాకులు తీసుకుని భరణం కింద రూ.4 లక్షలు పొందింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెడ్డి కుమార్‌తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తోంది. వారి పెళ్లికి కుమార్తె అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసి పూడ్చి పెట్టినట్లు సమాచారం.

February 25, 2026 / 02:22 PM IST

సోమందేపల్లిలో వాషింగ్ మిషన్లు పంపిణీ

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఏపీ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో రజకులకు ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రయోజన పథకం కింద దాదాపు 50 వాషింగ్ మిషన్లు బుధవారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రజకుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని నాయకులు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

February 25, 2026 / 02:20 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ

బాపట్ల: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్  అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరీక్షలు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

February 25, 2026 / 02:20 PM IST

పేదల సొంత ఇంటి కల నెరవేర్చండి: కోవూరు ఎమ్మెల్యే

నెల్లూరు: గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలి పోయిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ సమావేశాలలో పేదలకు పక్కా ఇళ్ల సమస్యపై ఆమె మాట్లాడుతూ.. ​గత ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని కోరారు.

February 25, 2026 / 02:18 PM IST

మున్సిపల్ కమిషనర్‌ పై సస్పెన్షన్ వేటు

శ్రీకాకుళం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న డయేరియా ఘటన పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కుర్మారావును బుధవారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమయ్యారని ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

February 25, 2026 / 02:18 PM IST

‘విలీన గ్రామాల సమస్య పరిష్కరించాలి’

PLD: చిలకలూరిపేటలో విలీనమైన పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాలపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మండలిలో మాట్లాడారు. కోర్టు కేసుల వల్ల వీటికి పంచాయతీ, మున్సిపల్ నిధులు రాక ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టు కేసును త్వరగా పరిష్కరించాలని కోరారు. వెంటనే ఆ గ్రామాలకు నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేపట్టాలని కోరారు.

February 25, 2026 / 02:17 PM IST

జనసేనలో చేరిన వైసీపీ నేత

VZM: గజపతినగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జామికి చెందిన నీటి సంఘం అధ్యక్షుడు, వైసీపీ నాయకులు సారికి గౌరినాయుడు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రాపు సురేష్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:16 PM IST

పంచాయతీ కార్యదర్శులతో సమావేశం

AKP: నాతవరం:ఎంపీడీవో ఎం.ఎస్. శ్రీనివాస్ బుధవారం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య, చెత్త సేకరణ, తాగునీటి పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా పాటించాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యానికి చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 25, 2026 / 02:15 PM IST

‘రైతులతో కలిసి నడిచిన సీఎం చంద్రబాబు’

ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దగల వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రైతులతో కలిసి నడుస్తూ పశ్చిమ ప్రాంత సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 02:15 PM IST

‘నీటి ఎద్దడి సమస్య ఉండరాదు’

PPM: రానున్న వేసవిని దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతీ గ్రామంలో క్రాష్ ప్రోగ్రాం జరగాలని, ఒక్క గ్రామానికి కూడా నీటి ట్యాంకర్ అవసరం రాకూడదని అన్నారు.

February 25, 2026 / 02:14 PM IST

మరణించిన కూడా ఇద్దరికీ చూపు

ATP: నార్పలకు చెందిన సత్యనారాయణమ్మ బుధవారం కన్నుమూశారు. మరణానంతరం ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శివన్న, నాగరాజు సహకారంతో రెడ్ క్రాస్ సంస్థకు నేత్రాలను అందజేశారు. గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను రెడ్ క్రాస్ సంస్థ ప్రత్యేకంగా అభినందించారు.

February 25, 2026 / 02:14 PM IST

వాడపల్లి వెంకన్న ఆలయానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వెలిచేరుకు చెందిన నల్లం వెంకట్రామారావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

February 25, 2026 / 02:13 PM IST