• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డి బైపాస్‌లో లారి బోల్తా

ELR: జంగారెడ్డిగూడెం స్థానిక బైపాస్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చి వద్ద లారీ బోల్తా పడింది. తెలంగాణ వైపు నుంచి రాజమండ్రి సైడ్ వెళ్తున్న లారీ ఆర్చి దగ్గరకి రాగానే అదుపుతప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గోవింద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.

February 22, 2026 / 12:17 PM IST

లైబ్రరీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి

AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో తేదీ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నరసింహారెడ్డి చిత్రపటానికి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు తెలియని స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.

February 22, 2026 / 12:16 PM IST

మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘనంగా నివాళులు

ATP: గుంతకల్లులో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్‌ కలాం చేసిన సేవలను కొనియాడారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు.

February 22, 2026 / 12:15 PM IST

డ్వాక్రా మహిళలకు రూ. 10వేల నుంచి రూ. లక్ష వరకు రుణం

KDP: కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం మార్చి నెలలో శ్రీకారం చుట్టనుంది. దీని కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

February 22, 2026 / 12:10 PM IST

28 ఏళ్ల మహిళ ఆత్మహత్య

ASR: రంపచోడవరం యర్రంరెడ్డినగర్ నివాసంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆశాజ్యోతి(28) ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ సన్యాసినాయుడు మీడియాకు తెలిపారు. దేవీపట్నం మండలానికి చెందిన ఆశాజ్యోతి, శివకుమార్ దంపతులు హోటల్ నిర్వహిస్తూ రంపచోడవరంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.

February 22, 2026 / 12:08 PM IST

వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. శాసనమండలిలో శ్రీవారి చిత్రపటాలను చెప్పుల కాళ్లతో తాకి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రసాయనాలతో కూడిన నెయ్యిని ఉపయోగించి కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు.

February 22, 2026 / 12:01 PM IST

మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం ఖాజా నగర్‌లో ఉన్న ఉర్దూ పాఠశాల, మసీదుల వద్ద చెత్తా అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలు నగర కమిషనర్ బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నాయకులు దగ్గరుండి చెత్తా తొలగించి మసీదు వద్ద శానిటేషన్ పనులు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

‘ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే’

ప్రకాశం: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం శివారులో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఆదివారం కావడంతో భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

సత్యసాయి: కదిరిలో టాటూ షాపు నిర్వహిస్తూ మహిళలను వేధిస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జల్సాల కోసం నాటు సారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అతని నుంచి స్కూటీ, నిషేధిత సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సబ్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. అలాగే అతనిపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

February 22, 2026 / 12:00 PM IST

ఈ నెల 24న కాణిపాకం హుండీ లెక్కింపు

CTR: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 24న లెక్కించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.

February 22, 2026 / 11:50 AM IST

నంద్యాలలో ఘనంగా శివరామకృష్ణ జన్మదిన వేడుకలు

నంద్యాలలో గోళ్ళ రాజేష్ కార్యాలయంలో సీనియర్ పాత్రికేయుడు శివరామకృష్ణ (RK9 NEWS ఎడిటర్) జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భ ఇవాళ పలువురు పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉస్మాన్ భాష, మస్తాన్, నూర్ భాషా, కుమార్, శ్రీనివాసులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:50 AM IST

జాతీయ సమైక్యత శిబిరానికి మైదుకూరు విద్యార్థి ఎంపిక

KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్ ఏ.బాలు, బెలగావిలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. ఈ శిబిరంలో ఆయన YVU తరపున APకు ప్రాతినిధ్యం వహిస్తారు.ప్రిన్సిపాల్ డా.పి.నారాయణరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ స్థాయిలో బాలు ఎంపిక కావడం పట్ల NSS పీవో డా. కృష్ణారెడ్డి,అధ్యాపకులు,విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 11:47 AM IST

కోట్ల వారి పల్లెలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

NDL: డోన్ పట్టణ పరిధిలో కోట్ల వారి పల్లెలో శ్రీ గంగ గంగమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొన్నారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 11:46 AM IST

కలికిరిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘన నివాళి

అన్నమయ్య: రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా కలికిరిలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి సత్యనారాయణరెడ్డి పాల్గొని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దుష్ట పాలనకు ఎదిరించి పోరాడిన వీరుడని తెలిపారు.

February 22, 2026 / 11:46 AM IST

ఉయ్యాల జీవిత చరిత్ర యువతకు ఆదర్శం: JC

VZM: బ్రిటిష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ కొనియాడారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఆదివారం జరిపారు. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేసి, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు నరసింహారెడ్డి అని అన్నారు.

February 22, 2026 / 11:45 AM IST