మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక మంది విశాఖ వాసులు భయాందోళన చెందుతూ…నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖలో భూ దో...
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ మారబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఏపీలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ కి ఏపీలో సరైన నాయకులు ఎక్కువ మంది లేరనే చెప్పాలి. అందుకే.. ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా… పోటీకి ...
రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...
సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాదు కదా…ఆయన తాత వచ్చినా తమకు ఏ నష్టం ఉండదని వెల్లడించారు. సీఎం జగన్ సింహం లాంటి వారని…అందరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదన్నారు. అయినా కూడా తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. అసలు మా పార్టీకి వ్యతిరేక ఓట్లే లేవని మంత్రి కారుమూరి అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్లు తమ ఓట్లు చీలే అవకాశమే ...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలతో సామాన్యుల జీవితాలు చిధ్రం అవుతున్నాయని విమర్శించారు. గుంతల రోడ్డు కారణంగా చిన్నారి మృతి, ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బిల్లు, పె...
ఏపీ రాజధాని విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు. కాగా.. తాజాగా ఈ విషయంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతాన...
ఓ చిన్న విషయం చిలికి చిలికి గాలి వానగా మారడం అంటే ఇదే. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో…చిరంజీవి, గరికపాటి మధ్య జరిగిన సంఘటన పెద్ద దుమారమే రేపింది. తన ప్రవచనాలకు ఆటంకం కలగడంతో గరికపాటి అసహనం వ్యక్తం చేయడం… దానిని చిరంజీవి అర్థంచేసుకొని వెంటనే ఆ సెల్ఫీ సెషన్ ఆపేయడం నమకు తెలిసిందే.అయితే.. నాగబాబు ఈ విషయంలో వేలు పెట్టడం, అభిమానులు రెచ్చిపోవడంతో విషయం చాలా పెద్దదిగా మారింది. దీంతో గరికపాటి ...
30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి ఇక మంగళం పాడేశానని వెల్లడించారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ మాత్రమే తమ నాయకుడు, సినిమా పెద్ద అని పేర్కొన్నారు. పవన్ పేదలకు అండగా ఉంటారని తెలిపారు. తనకు కరోనా వస్తే ఒక్కరూ కూడా పట్టించుకోలేదని పృధ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీతో దరిద్రం పోయిందని విమర్శించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పృధ్వీర...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి అంకురార్పణ చేశారు. ఆయన పార్టీ పెట్టడాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణనలో ప్రతిపక్ష పార్టీలన్నీ… ఈ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నవారే.. కాగా.. తాజాగా… ఈ పార్టీ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీకి మార్చుకోవటం వాళ్ల ఇష్టం అని బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. ఏపీలో ఉన్న...
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు. టీఆర్ఎస్ గా తెలంగాణ కే పరిమితమైన పార్టీని… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చేశారు. పార్టీ పేరు అయితే మార్చారు.. కానీ.. ఆ తర్వాత ఏంటి అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అంటే… కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం అయితే సరిపోదు. కనీసం రెండు, మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. అక్కడ కూడా క్యాండిడేట్స్ ని ఎంపిక చేయాల్సిన పని ఉంది. అంతేనా.. ...
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాల విషయం కాసేపు పక్కన పెట్టినా… మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ అభిమానులను మరింత ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నేపథ్యంలో.. పవన్ గురించీ, పవన్ పార్టీ గురించి చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను రాజకీయాలకు దూరం కావడానికి కారణాన్ని చెబుతూ.. తన సపోర్ట్ తన తమ్ముడికి ఎప్పుడూ ఉంటుందని తేల్చిచెప్పాడు. కాగా.. చిర...
ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రీమాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవం జరుపుతున్నారు. ఈ ఏడాది కూడా వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన కర్రల సా...
ఏపీలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్పై జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యారు. సీఐ దురుసు ప్రవర్తనతో ఆమెపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన మహిళకు వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు సీఐ అంజూ యాదవ్ తాను కావాలని దాడి చేయలేదని ఆడియో రిలీజ్ చేశారు...
రాజకీయాలపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు దూరం కావడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా లూసిఫర్ రిమేక్ గా తెరకెక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజివి.. పొలిటికల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదనన్నారు. భవిష్యత...
ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్కు ప...