NLR: వరికుంటపాడులో ఈ నెల 25న ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరుగుతుందని టీడీపీ మండల కన్వీనర్ మధుసూధన్ రావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ హాజరవుతారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.
SKLM: పర్యావరణ హితం కోరుతూ చెట్లను కాపాడండి అనే నినాదంతో ఓ యువకుడు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కె.పాలవలస గ్రామానికి చెందిన కొట్టెడ హరికృష్ణ చీపురుపల్లి నుంచి నేపాల్కు యాత్రను ప్రారంభించాడు. నరసన్నపేట మండలంలోని జమ్ము కూడలి వద్దకు చేరుకున్న యువకుడు మీడియాతో మాట్లాడాడు.
E.G: తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని జనసేన నేత, పి.గన్నవరం నియోజకవర్గం సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, జనసేన మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఆదివారం మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం అపఖ్యాతిపాలు చేసిందన్నారు. లడ్డూ వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.
TPT: తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ చేపట్టే ఆలోచన దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నివాసానికి టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి వెళ్లారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీఎం నివాసానికి ఆగమ పండితులు కలిసి సమావేశమయ్యారు.
విజయనగరం: పట్టణంలో పలు కూడళ్ళు వద్ద లీగల్ మెట్రాలజీ అధికారులు చికెన్, మటన్ చేపల, వర్తకులపై ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. చట్టవిరుద్ధమైన తూనిక రాళ్ళు వినియోగించి వినియోగదారులను మోసగించుచున్న ఐదుగురు చేపల వర్తకులపై కేసులు నమోదు చేశారు. ఇటువంటి మోసాలు చేసిన యెడల భారీగా అపరాధ జరిమానా విధిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరించారు.
కృష్ణా: హంసలదీవి బీచ్ వద్ద పరిసరాలను పాలకాయ తిప్ప మెరైన్ పోలీస్ సిబ్బంది పరిశుభ్రపరిచారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా మెరైన్ సీఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీచ్ పరిసర ప్రాంతాల్లోని వ్యర్ధాలను ఏరి, నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
CTR: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ముఖ్య మంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఉదయం చిత్తూరు రూరల్ మండలం పెరుమాళ్ కండ్రిగ పంచాయతీలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు.
SKLM: కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేసిందని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఆదివారం జిల్లాలోని గొంటి వీధిలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ వంటి పథకాలు వివరించారు.
VSP: వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్ను నుంచి ఉపశమనం లభించింది. చెత్త సేకరణకు ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో నగరవాసులపై ప్రతి నెలా రూ. 7. 77 కోట్లు భారం తగ్గినట్టయింది. సీఎం ప్రకటనపై నగరవాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నివాస భవనాలను నెలకు రూ. 120 చొప్పున వసూలు చేసేవారని స్థానిక ప్రజలు పేర...
ATP: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో పథకాలు మార్పులు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని 18వ వార్డులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటికి తిరుగుతూ.. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.
SKLM: ప్రతిభ కలిగిన గ్రూప్స్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఎర్రన్న విద్యాసంకల్పం గత 2 ఏళ్లుగా కొనసాగుతోంది. శ్రీకాకుళంలో ఎర్రన్న విద్యాసంకల్పం గ్రూప్ -2 మెయిన్స్ అభ్యర్థులకు 3వ మాక్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. శ్రీకాకుళం, పలాస, టెక్కలిలో నిర్వహించిన 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
WG: కాళ్ల మండలం ఏలూరుపాడులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీకి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నూజివీడులో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజ పర్యటనలో భాగంగా అంబేద్కర్ ఫ్లెక్సీని చింపి వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
KDP: దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ వాసవి మరకత కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు శరన్నవరాత్రులు పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు మాట్లాడుతూ…అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేది వరకు శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగం పట్టాభి రామయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
SRKL: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీతంపేట మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. చాకలిగూడ, పెద్దగూడ, తలాడ, అంటికొండ కుమ్మరగండి తదితదర పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
SKLM: జి. సిగడాం మండలం ముషిని వలస గ్రామంలో ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’అనే కార్యక్రమం సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అందించిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు.