హైదరాబాద్పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఆ అధ్యయన కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై పరిశోధనలు చేపడతానని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వారి మాదిరిగా తప్పుడు వాగ్దానాలు చేయమని అన్నారు. శుక్రవారం ఏలూరు(eluru) జిల్లా నూజివీడులో జరిగిన రైతులకు హక్కు పత్రాల అందజేత కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యలు చేశారు.
సొంత నియోజకవర్గంలో హోం మంత్రి తానేటి వనితకు చుక్కెదురైంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిని దళిత సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు.
ఏపీలో లక్షల మంది విద్యార్థులకు ఇంకా ఫీజు బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని నారా లోకేష్(nara lokesh) గుర్తు చేశారు. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న రూ.1650 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆమాాడ దూరంలో ఉందని, రౌడీల, గూండాల చేతుల్లో రాష్ట్రం అల్లాడిపోతుందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నాడు. జనసేనతో పొత్తుగురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్, తాను ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తులమని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు జనాల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వెన్ను పోటు పొడుస్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులు తిరుపతికి వెళ్లి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకోడడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా అలాంటి వారికిి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి రోజు 20 టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరి వాటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలితో తన్నగానే కష్టాలన్నీ పోతాయంటే ఎవరైనా నమ్ముతారా? ఈరోజుల్లో చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ 400 ఏళ్లుగా ఆ వింత ఆచారాన్ని కొంత మంది పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆచారం ఏపీలోని కర్నూలు జిల్లాలో హుల్తి లింగేశ్వరస్వామి ఆలయంలో ఉంది. 400 ఏళ్లుగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాల్లోనే ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.
ఏపీ మంత్రి రోజా వల్ల తమకు ప్రాణహానీ ఉందని ఓ జంట డీజీపీని ఆశ్రయించారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించకుండా.. వారిపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
బాలయ్య పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేడు ఆయన హిందూపురంలో ఓ శుభకార్యానికి హాజరవ్వగా ఓ వైసీపీ నేత ఆయన కారును అడ్డుకున్నాడు. పోలీసుల జోక్యంతో ఆ ఘటన సద్దుమణిగింది.
ఏపీలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.
నేడు స్కిల్ స్కామ్ కేసుపై విచారణ జరగనుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సీఐడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అలాగే స్కిల్ కేసులో ఏ22, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా ఉన్న యోగేష్ గుప్తాకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కూడా నేడు విచారణ జరగనుంది.
ఏపీ సీఎం జగన్ 8348 ఎకరాల భూమిని తమ బినామీ కంపెనీలకు ధారాదత్తం చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఒకే ఏడాది ఏడు నెలల్లోనే దాదాపు రూ.76 వేల కోట్ల ప్రాజెక్టులను తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి జగన్ అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చిన్న గొడవలో మాటమాట పెరగడంతో వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది.
విశాఖలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. పరిశ్రమల నుంచి వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యం తీవ్రం ఏర్పడింది. అదే సమయంలో దీపావళి పండగ కూడా రావడంతో కాలుష్యం మరికాస్తా ఎక్కువైంది. దీంతో కేంద్ర కాలుష్య నివారణ సంస్థ కీలక ప్రకటన చేసింది. విశాఖ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.