ఏపీ మంత్రి బొత్సకు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో నెల రోజుల పాటు బొత్స సత్యనారాయణను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటి ఏర్పాటు అయింది.
విశాఖ మధురవాడలో మద్యం లోడ్తో వస్తోన్న లారీ బోల్తా పడింది. బాటిళ్లను తీసుకునేందుకు అక్కడ ఉన్న జనం ఎగబడ్డారు.
ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) సమీపంలోని పాలధార పంచదార వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి (Leopard) మృతి చెందింది.
ఏపీలో రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని, గత నాలుగేళ్లలో రూ.7,800 కోట్లను పంట బీమా కింద అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. కడప పర్యటనలో ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. వేరే కారులో జగన్ ఇడుపులపాయలోని ఎస్టేట్కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎందుకు కావాలో ఒక్కరైనా సరైనా కారణం చెప్పండి అంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఆయన కొత్తగా చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.
ఏపీలో గత కొన్ని రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయనే చర్చ నేపథ్యంలో తాజాగా క్లారిటీ వచ్చేసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు కరెంట్ ఛార్జీలు పెంపు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గతంలో కంటే పెరిగిందని గుర్తు చేశారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం విజయవాడలో అలనాటి నటుడు నటుడు ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన కృష్ణుడి విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో కలిసి కమల్హాసన్ ఆవిష్కరించారు.
ఓ ఫంక్షన్ కోసం వెళ్లేందుకు ముగ్గురు యువ స్నేహితులు కలిసి ఒకే బైకుపై బయలు దేరారు. ఆ క్రమంలోనే లేట్ అవుతుందని బైక్ స్పీడ్ పెంచారు. అంతే ఆ క్రమంలోనే బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు చెల్లాచెదురుగా పడిపోయి మృత్యువాత చెందారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
ఆధార్ కార్డు జిరాక్స్తో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆధార్ జిరాక్స్ ద్వారా ఓ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా లావాదేవీలు జరిపాడు. అంతేకాకుండా ఆ ఆధార్ కార్డు నంబర్ను బ్యాంకు అకౌంట్కు లింక్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, వివిధ పథకాల్లోని డబ్బులను దోచుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తమ శుభలేఖలు, పూర్తి అడ్రస్ పంపితే వారికి శ్రీవారి తలంబ్రాలు, ప్రసాదాలు, పసుపు-కుంకుమ, కంకణాలు పంపనున్నట్లు ప్రకటించింది.
అధికారుల నిర్లక్ష్యం కాస్తా ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. అవును ఈ ఘటన ఏపీలో విజయవాడలో జరిగింది. అయితే అసలు ఏం జరిగింది? ఎలా బాలుడు మృత్యువాత చెందాడనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ నమోదు చేశామని, త్వరలో వారి ఆస్తులను అటాచ్ చేస్తామని ప్రకటించారు.
ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఈ విచారణను నవంబర్ 22వ తేదికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ బాబును అరెస్ట్ చేయొద్దని సీఐడీ అధికారులను ఆదేశించింది.
నేడు విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు తమ 1000వ రోజు ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం చౌరస్తాలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన తెలిపారు. రోడ్లను దిగ్బంధించి ఆందోళన నిర్వహించారు.