ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య జగన్ అక్రమాస్తుల కేసు విషయంపై పిల్ వేసిన నేపథ్యంలో ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.
ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు(AP Police) దాడి చేశారు. ఈ ఉదంతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది.
వైఎస్ఆర్ పేరు, ఏపీ లోగో వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.5,300 కోట్ల నిధులను నిలిపివేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి చివర్లో వైఎస్ఆర్ పేరు చేర్చడం ఏంటని సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో దీనిపై వివరణ కోరగా ఏపీ సమాధానమివ్వలేదు. దీంతో నిధులను నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించింది.
మాజీ సీఎం చంద్రబాబు సేవలో పురందేశ్వరి తరించి పోతున్నారిని ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స పూర్తయ్యింది. అలాగే చర్మ సంబంధిత పరీక్షలు కూడా ఏఐజీ ఆస్పత్రిలో పూర్తయ్యాయి. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.
ఏపీలోని ఓటరు జాబితాలో మహిళ స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ప్రత్యక్షమైంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ ఫోటో మహిళ స్థానంలో ఉండటంతో మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించుకున్న వారికి ఉచితంగా ఏడాదిపాటు మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ కింద నమోదు కాని రోగులు ఉంటే వారిని ప్రత్యేక కేసుల కింద పరిగణించి ఉచితంగా చికిత్స అందించాలని, వాటి బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కార్ మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. నవంబర్ 13న సోమవారం రోజు దీపావళి పండగను జరుపుకోవాలని సూచించింది. దీంతో ఏపీ ప్రజలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ప్లాట్ ఫారమ్పై నుంచి దూసుకెళ్లింది.
సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో భారీ మొత్తం నగదు వస్తోందని, భారతి సిమెంట్స్ ఆదాయం రూ.2 వేల కోట్లకు పెరిగిందని ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. పేదవాడ్ని అని చెప్పుకునే జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటివల పుంగనూరులో దళితనేతపై పోలీసులు చిత్రహింసలు చేయడంపై మండిపడ్డారు. అంతేకాదు మంత్రి పెద్ది రెడ్డి పాలనలో ఈ అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతు బజార్లలో సబ్సిడీపై రైతులకు ఉల్లిని అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. అటు కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇతర ప్రాంతాల్లోని ఉల్లిని పలు ప్రాంతాలకు తరలించి విక్రయించాలని నిర్ణయించుకుంది.
చంద్రబాబు(chandrababu)ను హైదరాబాద్లో ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) కలిసి దాదాపు రెండున్నర గంటలకు పైగా సుధీర్ఘంగా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో సహా మరికొన్ని అంశాలను పవన్ ప్రస్తావించినట్లు తెలిసింది.