VZM: నేరాలను నియంత్రించుటలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ సందర్బంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై 459, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 179 కేసులు నమోదు చేశామని తెలిపారు. అర్ధ రాత్రుళ్ళు సహేతుకరమైన కారణాలు లేకుండా తిరిగిన వారిపై 254 కేసులు నమోదు చేసామన్నారు.