ELR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న కైకలూరులోని ట్రావెలర్స్ బంగ్లాలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10, ఇంటర్,డిగ్రీ, బి.టెక్ పూర్తిచేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలన్నారు. 10 కంపెనీలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.