CTR: వినాయక చవితి వేడుక నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ కత్తి శ్రీనివాసులు శనివారం బంగారుపాల్యం మండలం టేకుమంద గ్రామంలో తనిఖీలు చేపట్టారు. సిబ్బందితో కలిసి గ్రామంలోని అనుమానాస్పద ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. ట్రబుల్ మేకర్స్, రౌడీ షీటర్లుకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.