VZM: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు తరలిరావాలని ఆ పార్టీ పీఏసీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం తన స్వగృహం వద్ద పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఈనెల 14న జరిగే ఆవిర్భావ దినోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షులు మునకాల జగన్నాధరావు (జగన్), రాపాక సాయి, త్రివేది పాల్గొన్నారు.