కృష్ణా: కుమార్తె అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. టైనర్పేటకు చెందిన సుకన్య కబేల వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5 ఉదయం ఇంటి నుంచి ఉద్యోగానికి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి శ్రీనివాసరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.